Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్షీణిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో చూస్తే కొత్తగా 6,617 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,26,751కి చేరుకుంది. ఇందులో 71,466 యాక్టివ్ కేసులున్నట్టు తెలుస్తుంది. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 10,228 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 17,43,176 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 57 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,109 కి చేరుకుంది.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,36,435 శాంపిల్స్ ను పరీక్షించినట్లు గా అధికారికంగా వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు చూస్తే

తూర్పుగోదావరి జిల్లాలో 1397 కేసులు, ప్రకాశం జిల్లాలో 526 కేసులు, చిత్తూరు జిల్లాలో 780 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 829 కేసులు, కడప జిల్లాలో 379 కేసులు, గుంటూరు జిల్లాలో 361 కేసులు, కర్నూలు జిల్లాలో 217 కేసులు, నెల్లూరు జిల్లాలో 364 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 405, విశాఖపట్నంలో 303 కేసులు, విజయనగరంలో 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా తెలుస్తుంది.
English summary
Corona cases are declining in the state of Andhra Pradesh. In the past 24 hours, 6,617 new positive cases have been diagnosed, according to the Department of Health. This brings the total number of cases in the state of Andhra Pradesh to 18,26,751. Of these, 71,466 were active cases. In the past 24 hours, 10,228 people have recovered from the corona epidemic.
Story first published: Wednesday, June 16, 2021, 20:03 [IST]