PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpgరైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించడం గురించి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బంది తో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే అని లేఖలో పేర్కొన్నారు. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు చేస్తున్నాయి అని లేఖలో వివరించారు. ముఖkishan reddy,kcr,ts;kcr;rakshita;mandula;madhya pradesh - bhopal;odisha;rajasthan;telangana;g kishan reddy;chief minister;minister;letter;central government;oxygen;reddy;manadesamకేసీఆర్ కు కేంద్ర మంత్రి లేఖ... విజ్ఞప్తి మన్నిస్తారా...?కేసీఆర్ కు కేంద్ర మంత్రి లేఖ... విజ్ఞప్తి మన్నిస్తారా...?kishan reddy,kcr,ts;kcr;rakshita;mandula;madhya pradesh - bhopal;odisha;rajasthan;telangana;g kishan reddy;chief minister;minister;letter;central government;oxygen;reddy;manadesamWed, 19 May 2021 18:00:00 GMTరైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించడం గురించి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బంది తో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే అని లేఖలో పేర్కొన్నారు. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు చేస్తున్నాయి అని లేఖలో వివరించారు.

ముఖ్యంగా ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ముఖ్యమైన నిత్యావసర వస్తువులైన ఆహార ధాన్యాలు, పాలు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఎరువులు, మందులు, బొగ్గు, సిమెంటు ఇంకా పరిశ్రమలకు కావలసిన ముడిపదార్థాలను సరఫరా చేస్తున్నాయి.  దేశవ్యాప్తంగా  కోవిడ్ కి సంబంధించిన అత్యవసర సామగ్రి పరికరాల సరఫరాలో కూడా రైల్వేశాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆక్సిజన్ కి సంబంధించి ప్రత్యేక రైళ్లను నడపడంలో కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ప్రత్యేకంగా నడిపిన శ్రామిక్ రైళ్ల విషయంలో కావచ్చు  రైల్వే శాఖ ఉద్యోగులు కోవిడ్ కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు.  

ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైల్వే ఉద్యోగులు కూడా కోవిడ్ బారిన పడటం లేదా తమకు తెలియకుండానే కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యే పరిస్థితులు ఉన్నాయి.  ఈ విషయాన్ని గమనించి దేశంలోని, ఒరిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వటానికి ఆదేశాలు కూడా జారీ చేశాయి.   ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే కూడా రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇదివరకే పలుమార్లు విజ్ఞప్తి చేసింది అని ఆయన పేర్కొన్నారు.

కాబట్టి, రైల్వే ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణాలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులను కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వారికి ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందితో సమానంగా వ్యాక్సినేషన్ తదితర సదుపాయాలు అందుబాటు లోకి వచ్చేలా తమరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లఢఖ్‌కు కొత్త మార్గం.. అనుమతి వచ్చేసింది..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>