NRISuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/nri-news9f8bae62-9341-4838-aa9d-1314e1b20b52-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/nri-news9f8bae62-9341-4838-aa9d-1314e1b20b52-415x250-IndiaHerald.jpgహైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఎన్నారైలు భారతీయ ప్రజల కోసం తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. లక్షల డాలర్లలో విరాళాలు కలెక్ట్ చేస్తూ కరోనా చికిత్సకు సంబంధించిన వైద్య సామాగ్రిని భారతదేశానికి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తరుణ్ కప్పల అనే ఒక యువ ఎన్నారై అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అనంతరం తన కారును అంబులెన్స్ గా మార్చి కరోనా రోగులను ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అంతేకాదు రోగులకు ఆసుపత్రులలో పడకలు అందించే విషయంలో సహాయం చేస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ దొరికేంతవరకు కరోనా రోగులకు ఉచితంగా కృతnri news;nri;tarun;hyderabad;american samoa;car;driver;yuva;oxygen;march;tarun kumar;coronavirus;fidaaఎన్నారై సాయానికి ఫిదా..?ఎన్నారై సాయానికి ఫిదా..?nri news;nri;tarun;hyderabad;american samoa;car;driver;yuva;oxygen;march;tarun kumar;coronavirus;fidaaSun, 16 May 2021 09:00:00 GMTతరుణ్ కప్పల అనే ఒక యువ ఎన్నారై అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అనంతరం తన కారును అంబులెన్స్ గా మార్చి కరోనా రోగులను ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అంతేకాదు రోగులకు ఆసుపత్రులలో పడకలు అందించే విషయంలో సహాయం చేస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ దొరికేంతవరకు కరోనా రోగులకు ఉచితంగా కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నారు.


ఒకరోజు తరుణ్ స్నేహితుడి యొక్క బంధువు కరోనా వైరస్ బారిన పడగా.. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ 34 వేల రూపాయలు తీసుకున్నాడట. ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాకైన తరుణ్.. పేదవాడి పరిస్థితి ఏంటని ఆలోచనలో పడిపోయారు. అప్పుడే తనకు తన కారుని అంబులెన్స్ గా మార్చాలనే ఆలోచన వచ్చింది. అయితే ఆయన తన కారును అంబులెన్స్ గా మార్చిన తర్వాత 24 మంది రోగులను ఆస్పత్రులకు తరలించారు. అలాగే రోగులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యేంతవరకు వారికి సహాయం చేశారు. ఒకవేళ ఆస్పత్రిలో పడకల దొరకకపోతే మళ్లీ వేరొక ఆస్పత్రికి తీసుకు వెళ్లేవారు. ఈ విధంగా తరుణ్ తన కారులో ఎక్కిన ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.



తరుణ్ హైదరాబాద్ తిరిగి రాకముందు అమెరికాలో డెలాయిట్ కంపెనీలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో స్ప్రింగ్‌ఎంఎల్‌లో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నారు. అతని తల్లి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్నారు. తరుణ్ కోవిడ్ -19 రోగులను ఆస్పత్రికి తీసుకు వెళ్లే పనిలో నిమగ్నం కాగా అతని అక్క తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.8 వేల నుంచి రూ.35 వేలకు పైగా తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే తరుణ్ రోగులకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తుండటంతో నగర వాసులందరూ ఫిదా అవుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తాక్టే తుఫాన్: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..!!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>