EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rrr-nu-thittenduku-lechina-norllu-ambulancelu-agithe-levalede2e9acc60-092c-4da6-b5a4-d2c974c004e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rrr-nu-thittenduku-lechina-norllu-ambulancelu-agithe-levalede2e9acc60-092c-4da6-b5a4-d2c974c004e7-415x250-IndiaHerald.jpgర‌ఘురామ రాజు ఘ‌ట‌న జ‌రిగిన రోజే ఏపీ - తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఏపీలో క‌రోనా ఉధృతితో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. అక్క‌డి ఆస్ప‌త్రుల‌న్నీ రోగుల‌తో కిక్కిరిసిపోయాయి. దీంతో ప‌లువురు మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ ఆస్ప‌త్రుల‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం తెలంగాణ అధికారులు ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్సుల‌ను నిలిపివేశారు. బోర్డ‌ర్ వ‌ద్ద‌నే అంబులెన్సులు నిలిచిపోవ‌డంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు మృతిచెందిన‌ట్లు వార్త‌లుసైతం వ‌mp raghu rama raju areest;krishna;guntur;andhra pradesh;telangana;rrr movie;mp;media;king;mla;alla ramakrishna reddy;ycp;party;santoshamఆర్ఆర్ఆర్‌ను తిట్టేందుకు లేచిన నోర్లు.. అంబులెన్సులు ఆగితే లేవ‌లేదే!ఆర్ఆర్ఆర్‌ను తిట్టేందుకు లేచిన నోర్లు.. అంబులెన్సులు ఆగితే లేవ‌లేదే!mp raghu rama raju areest;krishna;guntur;andhra pradesh;telangana;rrr movie;mp;media;king;mla;alla ramakrishna reddy;ycp;party;santoshamSun, 16 May 2021 12:36:31 GMTప్ర‌భుత్వాన్ని కించ‌ప‌ర్చే విధంగా వ్యాఖ్య‌లు, వ‌ర్గాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు, బెదిరింపుల‌కు పాల్పడ‌టం, కుట్ర‌పూరిత నేరం.. ఇలా ప‌లు సెక్ష‌న్ల కింద వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బ‌ల‌వంతంగా గుంటూరులోని సీఐడీకి కార్యాల‌యానికి తీసుకెళ్లి విచార‌ణ చేప‌ట్టారు. ఎంపీ అరెస్టు వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ ఎంపీగా ఉంటూనే వైసీపీ ప్ర‌భుత్వంపై ఆర్ఆర్ఆర్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌స్తున్నారు. అయినా ఆయ‌న్ను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌స్పెండ్ చేసేందుకు సాహ‌సించ లేదు. పార్టీలో జ‌రిగే అంత‌ర్గ‌త విబేధాలు, పార్టీ వ్య‌వ‌హారాల‌ను ఆర్ఆర్ఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో ర‌చ్చబండ పేరుతో హ‌డావుడి చేసిన ర‌ఘురామ రాజును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

ఆర్ఆర్ఆర్ను అరెస్టు చేయ‌డంతో వైసీపీ నేత‌లు మీడియా ముందుకు వ‌చ్చి విమ‌ర్శ‌ల దాడి చేశారు. ర‌ఘురామ రాజు ఏపీ ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడాడ‌ని, ఇలాంటి వారిని అరెస్టు చేయ‌టం స‌బ‌బేనంటూ పేర్కొన్నారు. ర‌ఘురామ రాజు వెనుకాల ఎవ‌రో ఉన్నార‌ని, అందుకే ఆయ‌న అలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని, ఆ నిజాల‌ను వెలికి తీసేందుకే సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు మీడియాకు వెల్ల‌డించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాయుడు ఓ అడుగు ముందుకేసీ వైసీపీ త‌ర‌పున ఎన్నికైన ర‌ఘురామ కృష్ణరాజు పిచ్చివాగుడు వాగుతుంటే చంద్ర‌బాబు సంతోషంతో ఆయ‌న వెనుక ఉండి మ‌రీ క‌థ న‌డిపిస్తున్నార‌ని అన్నారు. ఇప్పుడు ఆయ‌న అరెస్టుతో చంద్ర‌బాబు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డింద‌న్నారు.

ర‌ఘురామ రాజు ఘ‌ట‌న జ‌రిగిన రోజే ఏపీ - తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఏపీలో క‌రోనా ఉధృతితో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. అక్క‌డి ఆస్ప‌త్రుల‌న్నీ రోగుల‌తో కిక్కిరిసిపోయాయి. దీంతో ప‌లువురు మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ ఆస్ప‌త్రుల‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం తెలంగాణ అధికారులు ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్సుల‌ను నిలిపివేశారు. బోర్డ‌ర్ వ‌ద్ద‌నే అంబులెన్సులు నిలిచిపోవ‌డంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు మృతిచెందిన‌ట్లు వార్త‌లుసైతం వ‌చ్చాయి. ప‌లువురు మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి ఏపీలోని ఆస్ప‌త్రుల‌కు వెళ్లారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఏపీ - తెలంగాణ రాష్ట్రాల బోర్డ‌ర్ల వ‌ద్ద ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇంత జ‌రుగుతున్నా వైసీపీ నేత‌లు మాట్లాడేందుకు ముందుకు రాలేదు.

కేవ‌లం వైసీపీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతుంద‌ని, 2024వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రం ప‌రిధిలోనే హైద‌రాబాద్ ఉంటుంద‌ని, కానీ చంద్ర‌బాబు అన్నీ స‌ర్దుకొని ఏపీకి రావ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని పేర్కొన్నారు. మిగిలిన వైసీపీ నేత‌లు నోరుకూడా మెద‌ప‌లేదు. దీంతో ఏపీ ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌లు బోర్డ‌ర్ వ‌ద్ద ఇబ్బందులు ప‌డుతుంటే ఒక్క‌రు నోరుమెద‌ప‌లేద‌ని, రాజ‌కీయాల‌కు వ‌చ్చేస‌రికి ప‌దుల సంఖ్య‌లో మీడియా ముందుకొస్తున్నారంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుంటే క‌ట్ట‌డిచేయాల్సిన వైసీపీ నేత‌లు, ఆ వైపు దృష్టిసారించ‌కుండా క‌రోనా ఉధృతి స‌మయంలోనూ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఏపీలోని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>