PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9aeb889e-7a9b-40ad-b1f8-51a5f5afe9aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9aeb889e-7a9b-40ad-b1f8-51a5f5afe9aa-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోతే మాత్రం పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగం చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నది. ప్రజలు కూడా తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ వెళ్లి వైద్యం చేయించుకోవాలి అని భావిస్తున్న నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. మూడు రోజుల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశap,kcr,trs,ts;kcr;hyderabad;andhra pradesh;telangana;police;chief minister;letter;ycpఏపీ వ్యవహారం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?ఏపీ వ్యవహారం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?ap,kcr,trs,ts;kcr;hyderabad;andhra pradesh;telangana;police;chief minister;letter;ycpSat, 15 May 2021 11:31:33 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోతే మాత్రం పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య రంగం చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నది. ప్రజలు కూడా తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ వెళ్లి వైద్యం చేయించుకోవాలి అని భావిస్తున్న నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు.

మూడు రోజుల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. హైకోర్టు చెప్పినా సరే తెలంగాణ పోలీసులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. దీనితో తీవ్రస్థాయిలో ఆరోపణలు, ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక  రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఇటువంటి చర్యలకు దిగితే అది ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. తెలంగాణ వచ్చి వైద్యం చేయించుకుంటే దక్కుతాయని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు భావించి వస్తున్నారని కానీ అడ్డుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ తెలంగాణలో ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓట్లు కావాలి కానీ వారి ప్రాణాలు వద్దా అని కొంతమంది నిలదీస్తున్నారు. హైదరాబాదులో స్థిరపడిన చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం కేసీఆర్ కచ్చితంగా ఎన్నికల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా కక్ష సాధింపులు ఉండవచ్చు కానీ ప్రజల విషయంలో చూపించడం కరెక్ట్ కాదని వైద్య ఆరోగ్య రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది కాబట్టి పరిస్థితులు ఉన్నాయని దానికితోడు... 2024 వరకు హైదరాబాద్ పై ఆంధ్రప్రదేశ్ కు కూడా హక్కు ఉంది అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది అని కొంతమంది సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>