CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/boyfriend-dies-in-girlfriends-houseb7a408da-8d42-4391-827b-6ffd71611207-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/boyfriend-dies-in-girlfriends-houseb7a408da-8d42-4391-827b-6ffd71611207-415x250-IndiaHerald.jpgఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పగా అమ్మాయి తరపు వాళ్లు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పుకున్నారు. ప్రేమ జంటకు నిశ్చితార్థం కూడా చేశారు. ఇక ఇటీవల ఆ యువకుడు కాబోయే అత్తవారి ఇంటికి వెళ్లాడు.dead;nisha;nishanth;prema;district;police;marriage;love;tamilnadu;girl;father;v;santoshamప్రేయసి ఇంట్లో ప్రియుడు మృతి..!ప్రేయసి ఇంట్లో ప్రియుడు మృతి..!dead;nisha;nishanth;prema;district;police;marriage;love;tamilnadu;girl;father;v;santoshamThu, 13 May 2021 11:06:03 GMTఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పగా అమ్మాయి తరపు వాళ్లు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పుకున్నారు. ప్రేమ జంటకు నిశ్చితార్థం కూడా చేశారు. ఇక ఇటీవల ఆ యువకుడు కాబోయే అత్తవారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి చేపల కూర పులుసుతో విందు ఇచ్చారు. తన ప్రేయసి కొసరి కొసరి వడ్డిస్తుంటే పట్టరాని సంతోషంతో భోజనం చేశాడు ఆ యువకుడు. కానీ అంతలోనే షాకింగ్... ఆ భోజనం తిన్న కాసేపటికే అతడు వాంతులు చేసుకొని మరణించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని మున్నార్‌కు చెంది నిషాంత్ (30) చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మొదట యువతి తరపు బంధువులు ఒప్పుకోలేదు. కానీ అతడు నచ్చజెప్పడంతో చివరకు ఎలాగోలా ఒప్పుకున్నారు. ఇటవలే నిశ్చితార్థం కూడా జరిగింది. మే 17న వివాహం జరగాల్సి ఉంది. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తమిళనాడులో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నందున నిషాంత్ పనిచేస్తున్న కార్యాలయానికి సెలవులు ప్రకటించారు.

అయితే కేరళలో లాక్‌డౌన్‌తో అతడు సొంతూరికి వెళ్లలేక.. కాబోయే అత్త వారింటికి వెళ్లాడు. మంగళవారం అతడికి చేపల పులుసుతో భోజనం వడ్డించారు. అన్నం తిన్న కాసేపటికే నిషాంత్ వాంతులు చేసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. నిషాంత్ మాత్రమే చనిపోయాడు. సరిగ్గా ఇక్కడే అనుమానాలు పెరిగాయి. నిషాంంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిశాంత్ ప్రియుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమకు ఏపాపం తెలియదని.. కాబోయే అల్లుడి ఎలా చంపుకుంటామని వారు వాపోయారు. ఐతే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>