PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court-cases-live-telecasta673e372-8309-4a6e-9230-4f06f55638a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court-cases-live-telecasta673e372-8309-4a6e-9230-4f06f55638a2-415x250-IndiaHerald.jpgనేటి సమాజములో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. అమాయకులైన ప్రజలు ధనవంతులైన వారిచేత వివిధ కారణాలతో రకరకాలుగా హింసించబడుతున్నారు. అయితే ఇటువంటి సామాన్యులు ధనవంతులైన, రాజకీయ నేపధ్యం ఉన్న వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.SUPREME-COURT-CASES-LIVE TELECAST;ramana;suma;suma kanakala;media;court;supreme court;v;shaktiసుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం ... ?సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం ... ?SUPREME-COURT-CASES-LIVE TELECAST;ramana;suma;suma kanakala;media;court;supreme court;v;shaktiThu, 13 May 2021 17:55:00 GMTశక్తి లేదు. అందుకే మన రాజ్యాంగంలో న్యాయస్థానాలు నెలకొల్పబడ్డాయి. న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరూ సమానులే. చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు అనే ఎన్నో మంచి నియమాలను తీసుకురాబడ్డాయి. ఈ న్యాయస్థానాల ద్వారానే ఇటువంటి ఎంతోమంది అమాయకులు న్యాయపోరాటం చేస్తూ ఉంటారు. కానీ అందరికీ సమాన న్యాయం దొరకదు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం.

కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయడం , లాయర్లను కొనేయడం లాంటి ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి న్యాయాన్ని పారదర్శకంగా లేకుండా చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో, ఇటీవల సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ మన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్ వి రమణ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కొంత కాలం నుండి కోర్టులో జరిగే వాదోపవాదాలను ప్రత్యక్షప్రసారం చేయాలనే దానిపై తీవ్రంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ అంశంపై సుప్రీం కోర్ట్ ప్రత్యక్ష ప్రసారాలకు సుముఖంగా ఉన్నట్లు ఎన్ వి  రమణ స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంపై సహా న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్ట్ కార్యకలాపాలను మీడియా ముందు ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి చర్యలను వేగవంతం చేస్తామని చెప్పారు. అంతే కాకుండా సుప్రీం కోర్టుకు మరియు మీడియాకు మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని సైతం నియమించనున్నట్లు రమణ పేర్కొన్నారు.

ఇలా ప్రత్యక్ష ప్రసారాన్ని జర్నలిస్టులు అందరూ వీక్షించడానికి ప్రత్యేక యాప్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది.  ఇక్కడ చెబుతున్న ప్రకారం ఈ ప్రత్యక్ష ప్రసారం కేవలం జర్నలిస్టులకు మాత్రమే అని తెలుస్తోంది. కానీ ప్రజలకు కూడా ఈ లైవ్ చూసే అవకాశం లభిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రజలకు కూడా లైవ్ చూసే అవకాశం కల్పిస్తే వివిధ బాషలలో ప్రత్యక్ష ప్రారాన్ని తర్జుమా చేయాలని చెబుతున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా  ఎన్నికైన అతి తక్కువ కాలంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడంతో ప్రజలంతా ఇతనిపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు.  


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>