PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-7e03772a-b236-4e6a-83f8-2819b36dfd48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-7e03772a-b236-4e6a-83f8-2819b36dfd48-415x250-IndiaHerald.jpgసరిగ్గా రెండు నెలల క్రితం చూస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రపంచం కూడా భారత్ విషయంలో ఒక ఆశావహ భావనతో చూసేది. మోడీ లాంటి బలమైన ప్రధాని ఏలుబడిలో ఈ దేశం ఉందని కూడా ప్రతీ పౌరుడు అనుకునే వాతావరణం ఉండేది. modi;modi;india;american samoa;donald trump;prime minister;international;june;shakti;kothapalli samuel jawaharమోడీ అనుకున్నది ఒకటైతే... ?మోడీ అనుకున్నది ఒకటైతే... ?modi;modi;india;american samoa;donald trump;prime minister;international;june;shakti;kothapalli samuel jawaharWed, 12 May 2021 21:00:00 GMTసరిగ్గా రెండు నెలల క్రితం చూస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రపంచం కూడా భారత్ విషయంలో ఒక ఆశావహ భావనతో చూసేది. మోడీ లాంటి బలమైన ప్రధాని ఏలుబడిలో ఈ దేశం ఉందని కూడా ప్రతీ పౌరుడు అనుకునే వాతావరణం ఉండేది.

ఇక మోడీకి కూడా అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఒక్క మాట చెప్పుకోవాలంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరువాత మోడీ అంతర్జాతీయంగా తనదైన ముద్ర బలంగా వేశారు. అంతే కాదు ఆయన ప్రధానిగా తిరిగినన్ని దేశాలూ ఎవరూ తిరగలేదు అని కూడా చెప్పవచ్చు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తమ ప్రచారానికి మోడీని అమెరికా పిలిపించుకున్నాడు అంటనే నాడు మోడీ ప్రభ ఎలా వెలిగిపోయిందో అర్ధమవుతోంది.

సీన్ కట్ చేస్తే ఇపుడు జీ 7 దేశాల మీటింగ్ జూన్ లో జరుగుతూంటే మోడీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. దానికి కారణం దేశంలో బాగా ఉధృతం అవుతున్న కరోనా. ఈ మహమ్మారితో ప్రపంచం ఈనాడు భారత్ ని ఏదోలా చూస్తోంది.  కరోనా పుట్టిన చైనా కంటే కూడా దారుణంగా భారత్ పరిస్థితి తయారైంది. అయితే ఇక్కడ మోడీ వేసుకున్న కొన్ని అంచనాలు తప్పు కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు.

కరోనా రెండవ దశ ముప్పు భారత్ కి ఉండదు అని గట్టిగా భావించారు. భారతీయుల రోగ నిరోధక శక్తి మీద కూడా నమ్మకం ఉండేది. ఇక చలి దేశాలకు మాత్రమే ఈ వైరస్ పీడ ఎక్కువగా ఉంటుందని కూడా ఊహించారు. పైగా వేసవి వచ్చేసినందువల్ల భారత్ కి రెండవ దశ తాకినా పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకున్నారు. కానీ అదంతా తప్పు అని తేలింది. దాని ఫలితమే ఇపుడు దేశమంతా పాకేసిన కరోనా. దేశంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండదన్న ధైర్యంతోనే మోడీ ఇతర దేశాలకు కరోనా టీకాలను పంపించారు. కానీ కేవలం రెండు నెలల తేడాతో అవే దేశాల నుంచి భారత్ సాయాన్ని కోరవలసి వచ్చింది. ఏది ఏమైనా రెండవ దశ ఇలా భీకర రూపం దాల్చడంతోనే మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>