PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaaf554dc7-0d3d-4885-9ffb-0c07e491b861-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaaf554dc7-0d3d-4885-9ffb-0c07e491b861-415x250-IndiaHerald.jpgసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. మరణం ఎప్పడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. తాజాగా రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవిడ్‌ 19 సోకిన మృతదేహనికి నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఖ‌న‌నం చేసిన ఘ‌ట‌న‌లో 21 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది.Corona;mithra;district;village;local languageఆ గ్రామంలో 21 మంది మృతి.. కరోనా మరణాలేనా..?ఆ గ్రామంలో 21 మంది మృతి.. కరోనా మరణాలేనా..?Corona;mithra;district;village;local languageSat, 08 May 2021 21:02:18 GMTసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. మరణం ఎప్పడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. తాజాగా రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవిడ్‌ 19 సోకిన మృతదేహనికి నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఖ‌న‌నం చేసిన ఘ‌ట‌న‌లో 21 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా నాలుగు మ‌ర‌ణాలు మాత్రమే సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. మిగ‌తావారు వ‌యోభారం కార‌ణంగా చనిపోయిన‌ట్లు వెల్లడించారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆ గ్రామంలో అంతులోని విషాదాన్ని నింపింది.

అయితే ఏప్రిల్ 21న ఖేర్వా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా కాటుకు బలయ్యారు. దీంతో అతని మృత‌దేహన్ని గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంతిమ యాత్రలో సుమారు 150 మందికి పైగా బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. మృతదేహన్ని ప్లాస్టిక్ సంచిలో నుంచి బయటకు తీసిన‌ట్లు, ఖననం చేసే సమయంలో చాలా మంది దానిని తాకినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత చాలా మంది బంధు మిత్రులు, గ్రామస్తులు కరోనా బారినపడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఒకరి తరువాత మరొకరు చొప్పున మొత్తం 21 మంది ప్రాణాలను కోల్పోయారు.

ఇక ఇదిలావుంటే, మొత్తం 21 మరణాలలో కేవ‌లం న‌లుగురు వ్యక్తులు మాత్రమే కోవిడ్‌ 19 బారిన పడి చ‌నిపోయిన‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ‌గా వృద్ధులు ఉన్నారని వారంత వయో భారంతో చనిపోయినట్లు వెల్లడించారు. కోవిడ్‌ 19తోనే మ‌ర‌ణించారా? లేదా అని తెలుసుకునేందుకు తాము 147 కుటుంబాల నుండి శాంపిల్స్‌ను సేక‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. స‌మ‌స్య తీవ్రత‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో శానిటైజేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టిన‌ట్లు వెల్లడించారు. గ్రామస్తులకు అవగాహన కల్పించి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నామని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ విషయంలో అరెస్టులోద్దు.. కేంద్రానికి సుప్రీం సూచన..

టన్నుల కొద్దీ గ్లామర్ ఉన్నా నో యూజేనా... ?

'జూనియర్ ఎన్టీఆర్ - సమంత' జోడిగా నటించిన సినిమాలు ఇవే.. ఇందులో ఎన్ని హిట్ అయ్యాయంటే.??

చంద్రబాబుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు.. కోర్టులో కౌంటర్

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>