PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-868eb34f-67a6-480a-9562-8cd24c57af53-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-868eb34f-67a6-480a-9562-8cd24c57af53-415x250-IndiaHerald.jpgరామ‌గుండం మండ‌లం జ‌న‌గామ శివారులో మంచిర్యాల - గోదావ‌రిఖ‌ని రోడ్డుపై గోదావ‌రి ఆక్సిజ‌న్ ప్లాంట్ ఉండేది. ఈ ప్లాంట్ తీసుకున్న లోన్ తిరిగి చెల్లించ‌క పోవ‌టంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ప్లాంట్‌ను మూసివేసింది. 2009లో ఆస్తిని వేలం వేయ‌డంతో అదిలాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో డీఆర్వోగా ఉన్న మ‌ల్లిఖార్జున్‌రావు త‌న కొడుకు గోపీకృష్ణ పేరుతో దీన్ని సొంతం చేసుకున్నాడ‌ని స‌ద‌రు దిన‌ప‌త్రిక ప్ర‌చురించింది. అయితే 2011లో మ‌ల్లిఖార్జున్‌పై ఏసీబీ దాడులు జ‌ర‌గ‌డంతో ఆస్తుల‌ను అటాచ్ చేసుకున్న ఏసీబీ ఈ పTRS;kcr;krishna;telangana rashtra samithi trs;andhra pradesh;cabinet;mla;minister;wife;anti-corruption bureau;puvvada ajay kumar;petta;malla reddy;mancherial;party;mantraమ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?TRS;kcr;krishna;telangana rashtra samithi trs;andhra pradesh;cabinet;mla;minister;wife;anti-corruption bureau;puvvada ajay kumar;petta;malla reddy;mancherial;party;mantraSat, 08 May 2021 13:48:32 GMTతెరాస మంత్రులపై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తుతున్నాయి. మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌జ‌రుగుతుండ‌గానే మ‌రో మంత్రి భూ దందా వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. స‌ద‌రు మంత్రి రూ. కోట్ల విలువైన, అదీ ఏసీబీ జ‌ప్తులో ఉన్న భూమిని త‌న భార్య పేరుపై రిజిస్ట్రేష‌న్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ముద్ర‌ప‌డిన ఓ దిన‌ప‌త్రిక వెలుగులోకి తెచ్చింది. అయితే ఏసీబీ జ‌ప్తులో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేష‌న్ చేయించార‌న్న చ‌ర్చ ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వ్య‌వ‌హారంలో స‌ద‌రు మంత్రితో పాటు  అధికారుల పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

రామ‌గుండం మండ‌లం జ‌న‌గామ శివారులో మంచిర్యాల - గోదావ‌రిఖ‌ని రోడ్డుపై గోదావ‌రి ఆక్సిజ‌న్ ప్లాంట్ ఉండేది. ఈ ప్లాంట్ తీసుకున్న లోన్ తిరిగి చెల్లించ‌క పోవ‌టంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ప్లాంట్‌ను మూసివేసింది. 2009లో ఆస్తిని వేలం వేయ‌డంతో అదిలాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో డీఆర్వోగా ఉన్న మ‌ల్లిఖార్జున్‌రావు త‌న కొడుకు గోపీకృష్ణ పేరుతో దీన్ని సొంతం చేసుకున్నాడ‌ని స‌ద‌రు దిన‌ప‌త్రిక ప్ర‌చురించింది. అయితే 2011లో మ‌ల్లిఖార్జున్‌పై ఏసీబీ దాడులు జ‌ర‌గ‌డంతో ఆస్తుల‌ను అటాచ్ చేసుకున్న ఏసీబీ ఈ ప్లాంట్ భూమిని జ‌ప్తు చేసింది. 2015లో గోపీకృష్ణ ఈ భూమిని రిజిస్ట్రేష‌న్ చేసేందుకు విఫ‌ల‌య‌త్నం చేయ‌గా కుద‌ర‌లేద‌ని, అయితే 2018లో మంత్రి భార్యతో పాటు మ‌రో ముగ్గురు ఈ భూమిని కొన్న‌ట్లు డాక్యుమెంట్లు బ‌య‌టికొచ్చాయ‌ని స‌ద‌రు దిన‌ప‌త్రిక ప్ర‌చురించింది. స‌ర్వే నెంబ‌ర్ 854/బి లో 3.14 ఎక‌రాల భూమిని 1.60 కోట్ల‌కు గోపీ కృష్ణ నుండి కొన్న‌ట్లు చూపించారని, అస‌లు ఏసీబీ జ‌ప్తులో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేష‌న్ చేశార‌ని ఆ ప‌త్రిక ప్ర‌శ్నించింది.

ప్ర‌స్తుతం ఈట‌ల వ్య‌వ‌హారంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌సాగుతుంది. అచ్చంపేట వ‌ద్ద ఈట‌ల అసైన్డ్ భూముల‌ను క‌బ్జా చేశాడ‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించి, కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశాడు. ఈ క్ర‌మంలోనే మంత్రి మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. వీటిపై విచార‌ణ క‌మిటీని నియ‌మించాల‌ని సీఎం కేసీఆర్‌ను ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో మంత్రి భూ దందా వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈట‌ల‌ను పార్టీ నుంచి పంపించేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ ఇప్పుడు ప‌లువురు మంత్రుల‌కు, ప‌లువురు తెరాస ఎమ్మెల్యేల‌కు త‌ల‌నొప్పిగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే మాములుగా ఉండదు...

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>