SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/importance-of-mallikarjuna-swami96e95bc2-d358-404d-a794-540d4a54fddd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/importance-of-mallikarjuna-swami96e95bc2-d358-404d-a794-540d4a54fddd-415x250-IndiaHerald.jpgఆంద్రప్రదేశ్ లో ఉన్న విశిష్టమైన దేవాలయాల్లో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. ఇది కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైల పట్టణంలో నిలయమై ఉన్నది. ఈ దేవాలయం పరమ పవిత్రమైనది మరియు చాలా పురాతనమైన దేవాలయం. శ్రీశైలంలో జన సాంద్రత చాలా తక్కువ. మన సంప్రదాయాలను సంస్కృతిని అద్దం పట్టే ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. IMPORTANCE OF MALLIKARJUNA SWAMI;koti;shiva;deva;nithya new;maha shivratri;lord siva;aqua;nallamala forest;srisailam;v;mahaశ్రీశైల మల్లికార్జుని విశిష్టత గురించి తెలుసా ?శ్రీశైల మల్లికార్జుని విశిష్టత గురించి తెలుసా ?IMPORTANCE OF MALLIKARJUNA SWAMI;koti;shiva;deva;nithya new;maha shivratri;lord siva;aqua;nallamala forest;srisailam;v;mahaThu, 06 May 2021 06:00:00 GMTఆంద్రప్రదేశ్ లో ఉన్న విశిష్టమైన దేవాలయాల్లో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. ఇది కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైల పట్టణంలో నిలయమై ఉన్నది. ఈ దేవాలయం పరమ పవిత్రమైనది మరియు చాలా పురాతనమైన దేవాలయం. శ్రీశైలంలో జన సాంద్రత చాలా తక్కువ. మన సంప్రదాయాలను సంస్కృతిని అద్దం పట్టే ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీశైలం ఆలయం చాలా పురాతనమైనది, విశిష్టమైంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న ప్రధాన దేవుడు మల్లికార్జున స్వామి. ఇక్కడ ఆ శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం 14 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆంధ్రలో అత్యంత సుందరమైన నల్లమల ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తులు నిత్యం దేశవిదేశాల నుండి వేల సంఖ్యలో వస్తుంటారు.

శీతాకాలంలో శ్రీశైల ప్రదేశం మరింత ఆహ్లాదకరంగానూ, సుందరమనోహరంగానూ ఎంతో కనువిందు కలిగించే సహజ అందాలతో వెలిగిపోతుంది. నల్లమల్ల కొండలపై కొలువై ఉన్న ఆ శ్రీ మల్లికార్జునుడు భక్తుల కోరికలను తప్పక నెరవేరుస్తారని ప్రతీతి. ఇక్కడ పూజలందుకుంటున్న మల్లికార్జునుడి లింగం దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటికావడం విశేషం.  ఆ లింగం ఎంతో అద్భుతమైన వెలుగుతో నిండి జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. కార్తీకమాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. ఈ మాసంలో భక్తులు భారీ సంఖ్యలో ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తారు.

ఈ కార్తీక మాసంలో ఆ భోళాశంకరుడి కోసం శివ మాల ధరించి...41 రోజుల పాటు సకల నిష్ఠలతో ఉండి..ఆ శివుడికి మొక్కు చెల్లిస్తారు.  ప్రధానంగా ఇక్కడ మహా శివరాత్రి నాడు దేవాలయం కోటి కాంతులతో ప్రత్యేక పూజలతో, ప్రత్యేక అలంకరణలతో మెరిసిపోతూ కనువిందు చేస్తుంది. ఈ వేడుకని చూసేందుకు భక్తజనం దూర ప్రాంతాలనుండి తరలివస్తారు. ఇక్కడ భక్తులు తమ కోరికలను ఆ స్వామితో చెప్పుకుంటే తప్పక తీరుస్తాడని భక్తుల ప్రఘాడ నమ్మకం మరియు విశ్వాసం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకున్న వారికి తప్పని షాక్..

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>