PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చెప్పే అమరావతికి సంబంధించి 500 రోజులుగా ఉద్యమం జరుగుతూనే ఉంది. టీడీపీ ఇబ్బంది పడినా వైసీపీ ఇబ్బంది పడినా ఈ ఉద్యమం విషయంలో రైతులు మహిళలు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆవేదన వినాలి అని వారు కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా స్పందించలేదు అనే మాట వాస్తవం. కేంద్ర పెద్దలు అమరావతిలో ఆవేదన వినలేదు. దీనితో అమరావతి ఉద్యమం కాస్త ఇబ్బంది పడుతుంది. నేడు 500 రోజుకి చేరుకున్న సందర్భంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి మద్దతుగా టీnaralokesh,tdp,amaravathi,ap;lokesh;nara lokesh;amaravati;andhra pradesh;tdp;central government;ycp;lokesh kanagaraj;amaravathiఅమరావతే శాస్వతం అంటున్న చినబాబుఅమరావతే శాస్వతం అంటున్న చినబాబుnaralokesh,tdp,amaravathi,ap;lokesh;nara lokesh;amaravati;andhra pradesh;tdp;central government;ycp;lokesh kanagaraj;amaravathiFri, 30 Apr 2021 09:50:50 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చెప్పే అమరావతికి సంబంధించి 500 రోజులుగా ఉద్యమం జరుగుతూనే ఉంది. టీడీపీ ఇబ్బంది పడినా వైసీపీ ఇబ్బంది పడినా ఈ ఉద్యమం విషయంలో రైతులు మహిళలు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆవేదన వినాలి అని వారు కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా స్పందించలేదు అనే మాట వాస్తవం. కేంద్ర పెద్దలు అమరావతిలో ఆవేదన వినలేదు. దీనితో అమరావతి ఉద్యమం కాస్త ఇబ్బంది పడుతుంది. నేడు 500 రోజుకి చేరుకున్న సందర్భంగా ఉద్యమాలు జరుగుతున్నాయి.

తాజాగా అమరావతికి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి విషయంలో త్యాగం నిరుప‌యోగం కాదు అని అన్నారు. అమ‌రావ‌తి శాశ్వ‌తం అని చెప్పుకొచ్చారు.  రాజ‌ధాని లేని రాష్ట్రానికి  ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారు అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా 30 వేల‌మంది అన్న‌దాత‌లు స్వ‌చ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కి స‌హ‌క‌రించడంతో న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా విల‌సిల్లింది అమ‌రావ‌తి అని ఆయన తెలిపారు.

ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే సంప‌ద‌లాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమ‌రావ‌తిని కొన‌సాగించి, అభివృద్ధి చేయాల్సిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్వ‌నాశ‌న‌మే ల‌క్ష్యంగా మూడు రాజ‌ధానుల పేరుతో విద్వేషాలు విర‌జిమ్మారు అని మండిపడ్డారు. నాటి నుంచి ప్ర‌జారాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణకి న‌డుం బిగించిన రైతులు, మ‌హిళ‌లు స‌క‌ల జ‌నులూ శాంతియుతంగా ఉద్య‌మించారు అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం అండ‌తో ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణిచేసినా ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు అని అన్నారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని అంటూ గొంతెత్తి నిన‌దిస్తూనే వంద‌లాది గుండెలు ఆగిపోయాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు, ఉద్య‌మ‌కారులంద‌రికీ ఉద్య‌మాభివంద‌నాలు చెప్పారు. మీ త్యాగం నిరుప‌యోగం కాదు..అమ‌రావ‌తి శాశ్వ‌తం.. ప్ర‌జారాజ‌ధానిదే అంతిమ విజ‌యం..జై అమ‌రావ‌తి... జై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అని  పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>