PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijyashanthi videosaosasa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijyashanthi videosaosasa-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది అని అన్నారు బిజెపి నేత విజయశాంతి. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆమె స్పందించారు. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది అని ఆమె మండిపడ్డారు. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది అని ఆమె అన్నారు. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు అన్నారు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభvijayashanthi,kcr,trs,bjp,ts;kcr;vijayashanti;bharatiya janata party;telangana;party;mantraకేసీఆర్ కు జరిమానా వేస్తారా...?కేసీఆర్ కు జరిమానా వేస్తారా...?vijayashanthi,kcr,trs,bjp,ts;kcr;vijayashanti;bharatiya janata party;telangana;party;mantraWed, 21 Apr 2021 08:19:58 GMTతెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది అని అన్నారు బిజెపి నేత విజయశాంతి. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆమె స్పందించారు. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది అని ఆమె మండిపడ్డారు. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది అని ఆమె అన్నారు. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు అన్నారు.

విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు గుంపులుగా తీరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం, బెడ్స్ కొరత గురించి న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్ళు నమిలారు అని ఆరోపించారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసిందని అన్నారు. సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో... అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేదు అన్నారు విజయశాంతి.

గుణపాఠం నేర్చుకోవడం లేదు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గారు అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి అని వ్యాఖ్యలు చేసారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారు అని వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారు అని... ఆ ఫైన్ ఏదో మాస్కు ధరించని కేసీఆర్ గారికి, ఆ పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు కదా అనిపిస్తోంది అని అన్నారు. ఇక రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదు అని వ్యాఖ్యలు చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>