PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-mp-harshakumara9ce8256-891f-4f4b-9967-a273f2b22583-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-mp-harshakumara9ce8256-891f-4f4b-9967-a273f2b22583-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన కృష్ణదాస్ మెడ‌ల‌కు ఉచ్చు బిగుసుకుంటోందా? ఏజీవో అయితే ప్ర‌భుత్వం జారీచేసిందో.. అదే జీవో వారి మెడ‌కు చుట్టుకోనుందా? అనే ప్రశ్న‌ల‌కు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశార‌ని రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుపైనే ఏపీ సీఐడీ అట్రాసిటి కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రితో స‌హా మంత్రుల‌ను ఎలాగైనా స‌రే కోర్టుకు లాగాలన్న లక్ష్యంతో మాజీ ఎంపీ హర్షకుమార్ పావులుjagan, ycp, mp, harshakumar;cbn;alla rama krishna reddy;andhra pradesh;botcha satyanarayana;mp;government;capital;court;mla;arrest;letter;sajjala ramakrishna reddy;mantraజ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?jagan, ycp, mp, harshakumar;cbn;alla rama krishna reddy;andhra pradesh;botcha satyanarayana;mp;government;capital;court;mla;arrest;letter;sajjala ramakrishna reddy;mantraTue, 20 Apr 2021 17:21:23 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన కృష్ణదాస్ మెడ‌ల‌కు ఉచ్చు బిగుసుకుంటోందా?  ఏజీవో అయితే  ప్ర‌భుత్వం జారీచేసిందో.. అదే జీవో వారి మెడ‌కు చుట్టుకోనుందా? అనే ప్రశ్న‌ల‌కు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశార‌ని రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుపైనే ఏపీ సీఐడీ అట్రాసిటి కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రితో స‌హా మంత్రుల‌ను ఎలాగైనా స‌రే కోర్టుకు లాగాలన్న లక్ష్యంతో మాజీ ఎంపీ హర్షకుమార్ పావులు క‌దుపుతున్నారు. ఏ జీవోను సీఐడీ అధికారులు త‌ప్పుబట్టారో.. ఈ జీవోనే ఆధారంగా చేసుకొని జ‌గ‌న్ స‌ర్కార్ ద‌ళితుల భూముల‌ను లాక్కుంద‌ని ఆయ‌న‌ ఆరోపిస్తున్నారు. దాన్ని ఆధారంగా చేసుకొని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేసులు న‌మోదుచేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇళ్ల పేరుతో అసైన్డ్ భూములు లాక్కున్నారు
పేదలకు ఇళ్ల పేరుతో దళితుల నుంచి ప్రభుత్వం అసైన్డ్ భూములు లాక్కుందంటూ ఆధారాలతో సహా సీఐడీకి లేఖ రాసిన‌ట్లు  హర్షకుమార్ ప్రకటించారు. సీఐడీ నమోదు చేసిన కేసుల ప్రకారం.. తాను ఇచ్చిన ఫిర్యాదును చూసి.. జగన్‌, బొత్స, ధర్మాన కృష్ణదాస్‌పై కేసులు పెట్టాలని.. నోటీసులు పంపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల‌ను ప్ర‌భుత్వం తీసుకునేట‌ప్పుడు ద‌ళిత రైతులు తీవ్రంగా వ్య‌తిరేకించార‌ని, ఆ వార్త‌లేవీ మీడియాలో రాలేద‌ని, కొంత‌మంది రైతులు ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేయ‌గా వారిలో కొంద‌రు మ‌ర‌ణించార‌ని హ‌ర్ష‌కుమార్ తెలిపారు.

రాజ‌ధాని భూముల విష‌యంలో ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు
రాజధాని భూముల విషయంలో ఏ ద‌ళిత రైతూ ఫిర్యాదు చేయలేదు. తాము స్వచ్ఛందంగా ఇచ్చామని ప్రకటించారు. అయితే ఇళ్లస్థ‌లాల కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం సేకరించిన స్థలాలు అలాంటివికావు. ప్రభుత్వంమీద‌ భయంతో ఫిర్యాదులు చేయ‌డానికి వెన‌కాడుతున్నారేమోకానీ.. వారికి ధైర్యం కలిగిస్తే అసైన్డ్ రైతులంతా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నార‌ని హ‌ర్ష‌కుమార్ చెబుతున్నారు. తన ఫిర్యాదుపై స్పందించకపోతే కోర్టుకెళ్లాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో హ‌ర్ష‌కుమార్ ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>