PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో చిన్నారుల మిస్సింగ్ కేసులకు సంబంధించి ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై రాజకీయ పార్టీలు పోలీసులపై కూడా విమర్శలు తీవ్రంగానే చేస్తున్నాయి. ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి హైకోర్ట్ కూడా దృష్టి పెట్టింది. దాదాపుగా హైదరాబాద్ సహా మూడు జిల్లాల్లో చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనిపై తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంలో పోలీసులు తమ తప్పు ఏమీ లేదని చెప్తున్నాhigh court,ts;maya;hyderabad;high court;police;juneచిన్న పిల్లల మిస్సింగ్ పై తెలంగాణా హైకోర్ట్ ఫైర్చిన్న పిల్లల మిస్సింగ్ పై తెలంగాణా హైకోర్ట్ ఫైర్high court,ts;maya;hyderabad;high court;police;juneFri, 16 Apr 2021 13:00:00 GMTతెలంగాణాలో చిన్నారుల మిస్సింగ్ కేసులకు సంబంధించి ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై రాజకీయ పార్టీలు పోలీసులపై కూడా విమర్శలు తీవ్రంగానే చేస్తున్నాయి. ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి హైకోర్ట్ కూడా దృష్టి పెట్టింది. దాదాపుగా హైదరాబాద్ సహా మూడు జిల్లాల్లో చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనిపై తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ అంశంలో పోలీసులు తమ తప్పు ఏమీ లేదని చెప్తున్నా సరే సమర్ధవంతంగా విచారణ జరగడం లేదనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు చిన్నారులను మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో 30జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర సర్కార్ వివరించింది. చిన్నారుల అదృశ్యం తీవ్రమైన, సున్నితమైన అంశం అని హైకోర్ట్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

చిన్నారుల అదృశ్యంపై ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలని హైకోర్టు వెల్లడించింది. న్యాయ సేవాధికార సంస్థ, జువైనల్ జస్టిస్ బోర్డులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలి అని హైకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. ఎంత మంది చిన్నారులు అదృశ్యమయ్యారు? ఆచూకీ తెలుసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఎంత మందిని కుటుంబాలకు చేర్చారు? సమాజంతో కలిపేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలి అని ఈ సందర్భంగా హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. బాలల అక్రమ రవాణా ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలి అని పేర్కొంది. జూన్ 17లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయ సేవాధికార సంస్థ, జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు... కేసు విచారణను జూన్ 17 కి వాయిదా వేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతి కేసులో విస్తుపోయే నిజాలు.. !

సర్పంచ్ నుంచి మంత్రిగా, ఎంపీగా... ఎన్టీఆర్ మెచ్చిన ఎమ్మెల్యే...!

మహేష్ సినిమా కి ఐరన్ లెగ్ సెంటిమెంట్..ఇప్పుడెలా..!!

ఇలా అయితే థియేటర్స్ నడపడం మా వల్ల కాదు.. !!

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>