PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/crimeed1b736a-13df-4611-93b2-ccb2725cd3a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/crimeed1b736a-13df-4611-93b2-ccb2725cd3a7-415x250-IndiaHerald.jpgఅసంఘటిత కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని తెలంగాణా హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్లపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పిల్ పై హైకోర్టు విచారణ జరిగింది. విచారణకు ప్రత్యేక సిఎస్ రాణి కుముదినీ హాజరు అయ్యారు. అసంఘటిత కార్మికుల బోర్డు ఏర్పాటు చేసినట్లు సర్కార్ హైకోర్ట్ కి వివరించింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ ఎందుకు ప్రారంభించ లేదని హైకోర్ట్ నిలదీసింది. దేశవ్యాప్తంగా వివరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్ వేర్ సిద్ధం చేయనుందని రాష్ట్ర సర్కారhigh court,ts;rani;high court;court;chief minister;software;central governmentఅక్రమ కట్టడాలు కూల్చాల్సిందే... తెలంగాణా హైకోర్ట్అక్రమ కట్టడాలు కూల్చాల్సిందే... తెలంగాణా హైకోర్ట్high court,ts;rani;high court;court;chief minister;software;central governmentFri, 16 Apr 2021 12:00:00 GMTఅసంఘటిత కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని తెలంగాణా హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్లపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పిల్ పై హైకోర్టు విచారణ జరిగింది. విచారణకు ప్రత్యేక సిఎస్ రాణి కుముదినీ హాజరు అయ్యారు. అసంఘటిత కార్మికుల బోర్డు ఏర్పాటు చేసినట్లు సర్కార్ హైకోర్ట్ కి వివరించింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ ఎందుకు ప్రారంభించ లేదని హైకోర్ట్ నిలదీసింది. దేశవ్యాప్తంగా వివరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్ వేర్ సిద్ధం చేయనుందని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్ వేర్ కోసం రాష్ట్ర సర్కార్ ఎదురు చూస్తుందని తెలిపారు. సాఫ్ట్ వేర్ లో పొందు పరిచేందుకు డేటా సిద్ధంగా ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు... విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణకు కూడా హాజరు కావాలని ప్రత్యేక రాణి కుముదినీని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ నిర్మాణాలు, చర్యలు, కోర్టు స్టేలపై నివేదికలను జోనల్ కమిషనర్లు సంపరించారు. కోర్టులో స్టేల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందా తెలిపాలని జోనల్ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది.

 అక్రమ నిర్మాణాలకు కేవలం రంధ్రాలు చేసి వదిలేస్తున్నారని మండిపడింది. అక్రమ నిర్మాణం అని తేలితే పూర్తిగా ఎందుకు కూల్చ రాదన్న హైకోర్టు... అక్రమ నిర్మాణాలకు మూడు వారాల్లో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. మూడు వారాల తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. మరిన్ని వివరాల తో నివేదిక సమర్పించాలని జోనల్ కమిషనర్లను హైకోర్ట్ ఆదేశించింది. ఇక  ఇదిలా ఉంటే అక్రమ కట్టడాల విషయంలో రాష్ట్ర సర్కార్ చాలా సీరియస్ గా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సర్కార్ పై హైకోర్ట్ ఫైర్

షర్మిల బాణం దూసుకువస్తోంది...?

ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కొత్త గాసిప్‌... ఇలా అయితే క‌ష్ట‌మే ?

సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

తెల్లవారు జామున 3 గంటలకు..యాంకర్ రవి సీక్రెట్ చెప్పిన భార్య నిత్య..!!

సాగ‌ర్లో ఓటు రేటెంత ప‌లికిందంటే... పార్టీకో రేటు ?

తెలంగాణలో వై.ఎస్‌. షర్మిల దూకుడు మామూలుగా లేదుగా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>