పారదర్శకంగా వరంగల్ మున్సిపల్ ఎన్నికలు
పారదర్శకంగా మహా నగర పాలక సంస్థ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు:: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
మహా నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.
గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జిడబ్ల్యూ ఎంసి పరిధిలోని 66 వార్డులకు గాను వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.
కార్పోరేషన్ లో వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తయ్యాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సి, ఎస్టీ , బిసి, మహిళా, జనరల్ వార్డు పదవులు రిజర్వ్ చేసామని అన్నారు. జిల్లాలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకతతో నిర్వహిస్తున్నామని మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నామని కలెక్టర్ తెలిపారు.1 జనవరి ,2021 విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం వార్డుల వారీగా ఉన్న జనాభా, అందులో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారిగా జనాభా లెక్కలు తీసుకుని అధిక సంఖ్యలో ఉన్న వారికి అవార్డు కేటాయించడం జరిగిందని, మహిళా వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్రర్వుల మేరకు
66 వార్డులలో ఎస్టీ, ఎస్సి, బిసి, మహిళల అధికంగా ఉన్న జనాభా ప్రాతిపదికన 2 ఎస్టీ, 11 ఎస్సి, 20 బిసి, 17 జనరల్ మహిళ, 16 జనరల్ కు ఖరారు చేసిందని అన్నారు.
అందులో 2, 65 వార్డులు ఎస్టీ లకు కేటాయించగా అందులో డ్రా పద్ధతిన 65 వ వార్డ్ ఎస్టీ మహిళకు, 2 వ వార్డ్ ఎస్టీ జనరల్ కు, అదేవిధంగా 11 వార్డులు ఎస్సి లకు రిజర్వ్ చేయగా అందులో డ్రా పద్ధతిన 1,3,14,43,46 ఐదు వార్డులు ఎస్సి మహిళలకు, 15,17,18,37,47,53 ఆరు వార్డులు ఎస్సి జనరల్ కు , 20 బిసి లకు కేటాయించిన వార్డులలో 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజన్లను బీసీ మహిళలకు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లు బీసీ జనరల్కు కేటాయించారు. 33 వార్డులలో 17 వార్డులైన 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63, 64 డివిజన్లను జనరల్ మహిళలకు,మిగిలిన 16 వార్డులు 4,5, 7, 13, 22, 27, 31, 35, 45, 51, 52, 56, 60, 61, 62, 67 ఆన్ రిజర్వేడ్ జనరల్ గా కేటాయించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిని అనుసరిస్తూ వార్డుల వారీగా 50 శాతం మహీళా రిజర్వేషన్లు ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరుగుతుందని, పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిడబ్ల్యూ ఎంసి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి సమన్వయ సమావేశాలు నిర్వహించామని, పోలింగ్ కేంద్రాల వారీగా హైపర్ సెన్సిటివ,క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశామని, వెబ్ కాస్టింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని , డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, నిష్పాక్షికంగా ఫార దర్శకంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహి స్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లలో 800 ఓట్లకు మించకుండా ఏర్పాట్లు చేస్తున్నామని. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించామని అన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలను నియమించి నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
..