PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpa9dca960-e5dd-4fd1-97c9-1e6a71567217-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpa9dca960-e5dd-4fd1-97c9-1e6a71567217-415x250-IndiaHerald.jpgకేంద్రం ఒక మిధ్య అని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటారు. రాష్ట్రాలే నిజం అని కూడా నొక్కి వక్కానిస్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు కేంద్రం పెత్తనమేంటి అని కూడా గుస్సా అవుతారు. మీకు సీబీఐ ఉంటే మాకు ఏసీబీ ఉంది. మీరూ మేమూ సమానమే అని కూడా అంటారు tdp;modi;amit shah;dharma;prema;tara;tiru;telugu desam party;andhra pradesh;amith shah;2019;telugu;police;tirupati;cbi;love;husband;tdp;central government;anti-corruption bureau;partyకేంద్రం మీద ఎంత నమ్మకమో..ఫ్లాష్ బ్యాక్ మ్యాటరేంటో...?కేంద్రం మీద ఎంత నమ్మకమో..ఫ్లాష్ బ్యాక్ మ్యాటరేంటో...?tdp;modi;amit shah;dharma;prema;tara;tiru;telugu desam party;andhra pradesh;amith shah;2019;telugu;police;tirupati;cbi;love;husband;tdp;central government;anti-corruption bureau;partyTue, 13 Apr 2021 19:00:00 GMT
కేంద్రం ఒక మిధ్య అని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటారు. రాష్ట్రాలే నిజం అని కూడా నొక్కి వక్కానిస్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు కేంద్రం పెత్తనమేంటి అని కూడా గుస్సా అవుతారు.

మీకు సీబీఐ ఉంటే మాకు ఏసీబీ ఉంది. మీరూ మేమూ సమానమే అని కూడా అంటారు. చంద్రబాబు ఏపీ సీఎం గా ఉన్నపుడు చూసుకుంటే సీబీఐ ఎంట్రీని ఏపీలో లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కేంద్రం మీద విమర్శల పర్వం కూడా తమ్ముళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొనసాగించారు. మోడీ అమిత్ షా ఏపీకి వచ్చినపుడు వారి మీద నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు.

మరి ఇంత చేసిన తరువాత ధర్మ పోరాటాలు అయిపోయాక కేంద్రం మీద ఇపుడు ఒక్కసారిగా టీడీపీకి ప్రేమ పెరిగిపోయింది అంటున్నారు. అది కూడా 2019 ఎన్నికల్లో ఓడాక బాబు అండ్ కో కి కేంద్ర ప్రభుత్వం మీద వారి ఆద్వర్యంలోని ఏజెన్సీల మీద కూడా తెగ నమ్మకం కలుగుతోంది అని కూడా సెటైర్లు  పడుతున్నారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు. ఏపీ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు. ఏపీలో పరిషత్ ఎన్నికలు జరిగితే కొత్త ఎన్నికల అధికారిణి నీలం సాహ్ని మీద నమ్మకం లేదు. ఇలా ఏపీ సర్కార్ మీద నమ్మకం లేదంటున్న టీడీపీకి ఇపుడు మోడీ మీద ఆయన సర్కార్ మీద  మాత్రం అపారమైన నమ్మకం కలుగుతోంది.

కేంద్ర బలగాల ఆద్వర్యంలో తిరుపతి ఉప ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం  ఆద్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న టీడీపీకి మొత్తం కేంద్రమే దగ్గర ఉండి ఎన్నికల పర్వాన్న్ని నడిపించాలట. మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ కధలు టీడీపీ పెద్దలు మరచిపోయారు. జనాలు కూడా ఇక మరచిపోవాలి.  నాడు వద్దు అన్న మోడీ ఇపుడు తెగ నచ్చేస్తున్నాడు. మొత్తానికి టీడీపీ బుర్రే బుర్ర అని తమ్ముళ్ళు మాత్రమే పొంగి పొర్లాలేమో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నూజివీడు నుంచి ఢిల్లీకి మొదటి కిసాన్ రైలు...

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>