PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu9c9f590a-6cbf-4658-a52e-5a54699c9efe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu9c9f590a-6cbf-4658-a52e-5a54699c9efe-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ చమటోడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కధ క్లైమాక్స్ కి చేరింది. ఇక ఓటరన్న జడ్జిమెంట్ కి వేళ అవుతోంది. సరిగా ఈ సమయంలో చంద్రబాబు సభ మీద రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళు తన పైన వైసీపీకి చెందిన వారే వేరే అని చంద్రబాబు అంటున్నారు. తన లాంటి వారికే రక్షణ లేకపోతే మరి ఎలా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.babu;tiru;telugu desam party;jagan;2019;peddireddy ramachandra reddy;telugu;smart phone;police;tirupati;minister;husband;tdp;ycp;partyటీడీపీ యాగీ వెనక ?టీడీపీ యాగీ వెనక ?babu;tiru;telugu desam party;jagan;2019;peddireddy ramachandra reddy;telugu;smart phone;police;tirupati;minister;husband;tdp;ycp;partyTue, 13 Apr 2021 10:59:12 GMT
తెలుగుదేశం పార్టీ చమటోడుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కధ క్లైమాక్స్ కి చేరింది. ఇక ఓటరన్న జడ్జిమెంట్ కి వేళ అవుతోంది. సరిగా ఈ సమయంలో చంద్రబాబు సభ మీద రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళు తన పైన వైసీపీకి చెందిన వారే వేరే అని చంద్రబాబు అంటున్నారు. తన లాంటి వారికే రక్షణ లేకపోతే మరి ఎలా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక రోడ్డు మీదనే ఆయన ధర్నా కూడా చేశారు. మొత్తానికి చంద్రబాబు మీద దాడి జరిగింది అన్నది టీడీపీ అనుకూల మీడియాలో పెద్దగా హైలెట్ అయిపోయింది. ఇంతకీ చంద్రబాబు మీద దాడి ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది మాత్రం ఒక రాజకీయంగా ఉందంటున్నారు.

దీని మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బాబు మీద ఎందుకు దాడి చేస్తామని కూడా ప్రశ్నించారు. ఆయన పార్టీ నాయకుల మీద దాడి చేయాల్సిన అవసరం కూడా తమకు లేదని కూడా చెబుతున్నారు. లాజిక్ గా ఆలోచన చేస్తే పోలింగునకు డేట్ దగ్గర పడుతున్న వేళ ఇలాంటివి ఎవరూ చేయాలనుకోరు. చేసి మరీ తమ వైపు నిందలు వేసుకోవాలని కూడా అసలు అనుకోరు. అదే సమయంలో తెలుగుదేశం వారు మాత్రం వైసీపీయే ఈ దాడి చేయించింది అంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం టీడీపీకి సానుభూతి కావాలి అన్నది అని వైసీపీ నేతలే చెబుతున్నారు.

టీడీపీ కి సింపతీ కార్డుతో తిరుపతి ఎన్నికలో గెలవాలనుకుంటోందని కూడా అంటున్నారు. అయితే హిస్టరీ చూస్తే సానుభూతి ఎపుడూ వర్కౌట్ అయిన దాఖలాలు ఏపీలో లేవు. 2003లో చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగితే జనాలు 2004లో ఓడించేశారు. సానుభూతి అన్న మాటే ఎక్కడా నాడు రాలేదు. ఇక 2019 ఎన్నికల వేళ చంద్రబాబు తాను పాలనలో తప్పులు కనుక చేస్తే మన్నించాలని  జనాలకు వంగి వంగి దండాలు పెట్టినా కూడా వారు జగన్ కే ఓటెత్తారు. ఇపుడు  చేతిలో స్మార్టు ఫోన్ అందరికీ ఉంది. దాంతో  అన్నీ క్షణాలలో తెలిసిపోతున్నాయి. ఇక సానుభూతి మంత్రాలకు ఓట్ల చింతకాయలు రాలే రోజులు మాత్రం కావు. అయితే చంద్రబాబు సభ మీద రాళ్ళు ఎవరు వేశారు అన్నది పోలీసులు నిగ్గు తేల్చి నిజాలు మాత్రం వెలికి తీయాలని అంతా కోరుకుంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో కరోనా... మరో షాకింగ్ న్యూస్

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>