PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6d2bba52-4861-4c08-a26a-977209bbb4d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6d2bba52-4861-4c08-a26a-977209bbb4d8-415x250-IndiaHerald.jpgపెరుగుతున్న కరోనా కేసుల‌తో మహారాష్ట్ర రాష్ట్రం అల్ల‌క‌ల్లొలం అవుతోంది. ఇక్క‌డ నిత్యం కొత్తగా 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అల‌ర్టైన రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రులకు అందుబాటులోకి తెచ్చేందుకు ముంబయి అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని స్టార్‌ ఆసుపత్రులను కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చేందుకు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సహకారంతో ఇక్కడcorona;health;nithya new;mumbai;maharashtra - mumbai;maharashtra;central governmentక‌ట్టలు తెంచుకున్న క‌రోనా.. స్టార్ హోట‌ళ్ల‌న్నీ ఇక‌ కోవిడ్ కేర్ సెంట‌ర్లే..క‌ట్టలు తెంచుకున్న క‌రోనా.. స్టార్ హోట‌ళ్ల‌న్నీ ఇక‌ కోవిడ్ కేర్ సెంట‌ర్లే..corona;health;nithya new;mumbai;maharashtra - mumbai;maharashtra;central governmentTue, 13 Apr 2021 07:32:17 GMTపెరుగుతున్న కరోనా కేసుల‌తో మహారాష్ట్ర రాష్ట్రం అల్ల‌క‌ల్లొలం అవుతోంది. ఇక్క‌డ నిత్యం కొత్తగా 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అల‌ర్టైన రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రులకు అందుబాటులోకి తెచ్చేందుకు ముంబయి అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని స్టార్‌ ఆసుపత్రులను కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చేందుకు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సహకారంతో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఐఎస్‌ చాహల్ సోమ‌వారం మీడియాకు వెల్లడించారు.


మరో మూడు వారాల్లో 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు కొవిడ్‌ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో 200 ఐసీయూ పడకలు, 70శాతం ఆక్సిజన్‌ సదుపాయం ఉండేలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా  కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు పలు స్టార్‌ హోటళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం ముంబయి మ‌హా న‌గ‌రంలో దాదాపు 141 ఆసుపత్రుల్లో 19వేల పడకలు అందుబాటులో ఉన్నాయ‌ని హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే  వీటిలో 2466 ఐసీయూ పడకలు ఉండగా.. త్వరలోనే మరిన్ని ఐసీయూ పడకలను సిద్ధం చేస్తున్న‌ట్లుగా అధికారులు తెలిపారు.


 దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. తాజాగా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే పాజిటివ్‌ కేసుల సంఖ్యకు అంతేలేకుండా పోతోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండటంతో అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,751 కరోనా కేసులు నమోదు కాగా, 258 మరణాలు నమోదయ్యాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్‌పై క‌రోనా ఎంత‌లా ప్ర‌భావం చూపుతోందంటే... పాపం నాని సినిమా..!

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>