PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask3d15f53a-feac-478c-b00d-976f0f98fc16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask3d15f53a-feac-478c-b00d-976f0f98fc16-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్నాయి. కానీ.. జనంలో మాత్రం పెద్దగా భయం కనిపించడం లేదు. ప్రభుత్వాలు నెత్తీనోరూ బాదుకుంటున్నా జనం మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కు ధరించడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేసింది. అంతే కాదు.. మాస్కు ధరించని వారికి జరిమానా విధించాలని ఉన్నతాధిరులకు ఆదేశాలు అందాయి. ఎవరైనా సరే బయట మాస్కు లేకుండా కనిపిస్తే రూ.వెయ్యిmask;amala akkineni;tiru;hyderabad;warangal;telangana;district;huzur nagar;police;karimnagar;siddipetమాస్కు లేకపోతే రూ.1000 ఫైన్.. ఫస్ట్ రోజు పోలీసుల కలెక్షన్ ఎంతో తెలుసా..?మాస్కు లేకపోతే రూ.1000 ఫైన్.. ఫస్ట్ రోజు పోలీసుల కలెక్షన్ ఎంతో తెలుసా..?mask;amala akkineni;tiru;hyderabad;warangal;telangana;district;huzur nagar;police;karimnagar;siddipetMon, 12 Apr 2021 00:00:00 GMTదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్నాయి. కానీ.. జనంలో మాత్రం పెద్దగా భయం కనిపించడం లేదు. ప్రభుత్వాలు నెత్తీనోరూ బాదుకుంటున్నా జనం మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కు ధరించడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేసింది. అంతే కాదు.. మాస్కు ధరించని వారికి జరిమానా విధించాలని ఉన్నతాధిరులకు ఆదేశాలు అందాయి.

ఎవరైనా సరే బయట మాస్కు లేకుండా కనిపిస్తే  రూ.వెయ్యి జరిమానా విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు  అన్ని జిల్లా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ మంది జనం ఉండే ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించకపోతే.. అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.

ఇలా రూల్ పెట్టారో లేదో.. ప్రభుత్వానికి జరిమానాల సొమ్ము క్యూ కడుతోంది. మొదటి రోజే 6478 మందికి జరిమానా విధించినట్టు లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 3214 మందికి ఇప్పటికే జరిమానా విధించారట. ఇక రామగుండం, వరంగల్,ఖమ్మం, నిజామాబాద్,సిద్దిపేట, కరీంనగర్ కమిషనరేట్ల్ పరిధుల్లో మరో 1374 మందికి జరిమానా విధించారట. ఇవి కాకుండా మిగిలిన జిల్లాల్లో  మరో 1890 మందికి జరిమనా విధించారట. ప్రత్యక్షంగానే కాకుండా సిసిటివి కెమెరాల ద్వారా కూడా పోలీసులు కేసులు జరిమానాలు విధిస్తున్నారు.

ఇలా చూస్తే మొదటి రోజు 6500 మంది వరకూ జరిమానాలు విధించారు. అంటే.. మొదటిరోజే దాదాపు 65 లక్షల రూపాయలు ప్రభుత్వానికి జరిమానాల ద్వారా లభించిందన్నమాట. అందుకే పోలీసులు.. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆటోల్లో మైకులతో ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. అయినా జనం పట్టించుకోవడం లేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారీ ఆఫర్ ను మిస్ చేసుకున్న నితిన్ సినిమా..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>