Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021b4f8ea54-f348-420e-ad17-51a8f0024c29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-2021b4f8ea54-f348-420e-ad17-51a8f0024c29-415x250-IndiaHerald.jpgచెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భారత క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. దీంతో ధోనీతో పాటు చెన్నై జట్టు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా శనివారం ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై టీం స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.12 ల‌క్షల జ‌రిమానా విధించారట.ఇకపోతే ఈ సీజన్‌లో ధోనీ చేసిన‌ తొలి త‌ప్పుగా దీనిని ప‌రిగ‌ణించిన బోర్డ్ ధోనీని..ipl 2021;amala akkineni;ali;ranina;delhi;cricket;bcci;chennai;shikhar dhawan;adimulapu suresh;paruguధోనీకి దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ భరీ ఫైన్ధోనీకి దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ భరీ ఫైన్ipl 2021;amala akkineni;ali;ranina;delhi;cricket;bcci;chennai;shikhar dhawan;adimulapu suresh;paruguMon, 12 Apr 2021 16:04:00 GMTఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భారత క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. దీంతో ధోనీతో పాటు చెన్నై జట్టు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా శనివారం ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై టీం స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రూ.12 ల‌క్షల జ‌రిమానా విధించారట.ఇకపోతే ఈ సీజన్‌లో ధోనీ చేసిన‌ తొలి త‌ప్పుగా దీనిని ప‌రిగ‌ణించిన బోర్డ్ ధోనీని కేవ‌లం జ‌రిమానా వేసి వ‌దిలేసిందట. ప్రస్తుతం ఈ విషయం ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. తొలి మ్యాచ్‌లోనే ధోనీ ఫైన్ ఎదుర్కోవడంతో మిగతా మ్యాచ్‌ల పరిస్థితేంటని వారంతా ఆందోళన చెందుతున్నారట.

ఐపీఎల్‌ 14వ సీజన్ ప్రారంభానికి ముందే ఈ సారి నిబంధనలను కఠినంగా అమలు చేయబోతున్నామన్ని బీసీసీఐ ప్రకటించింది. 90 నిముషాల్లో ఇన్నింగ్స్ పూర్తి కావలసిందేనని, అందులో 5 నిముషాలు బ్రేక్ టైం అని, మిగతా 85 నిముషాల్లో 20 ఓవర్లు వేయాల్సిందేనని రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఏ జట్టుకైనా భారీ జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఏ జట్టైనా తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్‌ను జరిమానా విధిస్తామని, ఆ తర్వాత కూడా ఇలానే చేస్తే.. ఆటగాళ్లకు కూడా జరిమానా విధించడంతో పాటు కెప్టెన్‌పై మ్యాచ్ నిషేధం కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే ధోనీకి జరిమానా విధించింది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్క్‌కేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. 189 పరుగల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. ప్రధానంగా ఢిల్లీ ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు దారుణ ఓపెనింగ్ లభించింది. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా(54), మోయీన్ అలీ(36) సంయమనంతో ఆడడం, చివర్లో శామ్ కర్రాన్(34)ధాటిగా ఆడడంతో చెన్నై 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధవన్, పృధ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వికెట్ కోల్పోయకుండా 137 పరుగులు చేసింది. ఆ తర్వాత పృధ్వీ షా అవుటైనా ధావన్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అల్లు అర్జున్ ఐకాన్ లో హీరోయిన్ గా ఆమెను సెలెక్ట్ చేసారా ....??

ఏమిట్రా ఇది... ఎవ‌డ‌బ్బ సొమ్మురా.. పంచ‌డానికి??

కేసీఆర్ ప్లాన్ ఫాలో అవుతున్న జగన్...?

సవాల్ కు స్పందించడం టీడీపీకి రాదా...?

అధికారంలో వైసీపీ ఉంటే టీటీడీని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుంది ?

"వకీల్ సాబ్ " పెట్టిన రచ్చ ..నాగబాబు,మంత్రి పెర్ని నాని మద్య వార్..!!

ఉగాది రోజున నారప్ప నుంచి చిన్న సర్ప్రైజ్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>