PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newse80000a2-32fd-49c4-b2b0-d4f7f6bdbf88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newse80000a2-32fd-49c4-b2b0-d4f7f6bdbf88-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం తిరుపతిలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే భక్తులతో ఎంతో రద్దీగా ఉండే తిరుపతికి పార్లమెంట్ ఎన్నికలు కూడా తోడవ్వడంతో ఒక్కసరిగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం అక్కడ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి తిరుపతి వచ్చే వారు స్వచ్చందంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని కమిషనర్ పి. ఎస్ గిరిషా అన్నారు. తిరుపతి నగర పాలక సంస్థలో అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ గిరిషా latest news;amala akkineni;tiru;jagan;maharashtra - mumbai;tirupati;parliment;maharashtra;husband;letter;houseతిరుపతి లో కొత్త సమస్య..!!తిరుపతి లో కొత్త సమస్య..!!latest news;amala akkineni;tiru;jagan;maharashtra - mumbai;tirupati;parliment;maharashtra;husband;letter;houseSun, 11 Apr 2021 19:55:23 GMT ప్రస్తుతం తిరుపతిలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే భక్తులతో ఎంతో రద్దీగా ఉండే తిరుపతికి పార్లమెంట్ ఎన్నికలు కూడా తోడవ్వడంతో ఒక్కసరిగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రభుత్వం అక్కడ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి తిరుపతి వచ్చే వారు స్వచ్చందంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని కమిషనర్ పి. ఎస్ గిరిషా అన్నారు. తిరుపతి నగర పాలక సంస్థలో అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ గిరిషా మాట్లాడుతూ.. కరోనా కేసులు తిరుపతిలో గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా వుంచాలని వాలంటీర్లను ఆదేశించారు.

ప్రజలే కరోనా ను దృష్టిలో ఉంచుకొని స్వచ్చందంగా క్వారెంటైన్ నిబంధనలను పాటించాలని అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున ఆ రాష్ట్రం నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కమిషనర్ పి.ఎస్ గిరిషా తెలిపారు. ఇక అక్కడ నైట్ కర్ఫ్యూ లు, వీకెండ్ లాక్ డౌన్ కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం నుండి వచ్చే అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శణానికి వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ గిరిషా హెచ్చరించారు.

ఇక ప్రస్తుతం తిరుపతి లో పార్లమెంట్ ఉపఎన్నిక కూడా జరుగుతుండడం వల్ల వివిధ రాష్ట్రాలనుండి ప్రముఖ నేతలు వచ్చి తిరుపతిలో ప్రచారాలు నిర్వహించే అవకాశం ఉండడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య తిరుపతిలో అధికంగా ఉండడం వల్ల సి‌ఎం జగన్ ఈ నెల 14న జరగవలసిన ప్రచార సభను రద్దు చేశారు. కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తన పర్యటనను రద్దు చేసినట్లు సి‌ఎం జగన్ బహిరంగ లేఖ ద్వారా పేర్కొన్నారు. మరి మిగత పార్టీల నేతలు కూడా తమ ప్రచార పర్యటనలను వాయిదా వేసుకుంటారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికి కరోనా విజృంబిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు రద్దీగా ఉండే తిరుపతికి ఎన్నికలు కూడా తొడవ్వడంతో కొత్త సమస్య ఎదురవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొత్తానికి బాబు మొదలెట్టాడు....ఇక ఊకదంపుడే ....??

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>