PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan21256eb2-7be1-44b8-a12e-a9ddf72f4660-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan21256eb2-7be1-44b8-a12e-a9ddf72f4660-415x250-IndiaHerald.jpgఏపీలో అనేక ట్విస్టుల మధ్య పరిషత్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో 60 శాతం వరకే పోలింగ్ నమోదైంది. అయితే 2014లో 80 శాతం పైనే పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈ సారి పల్లె జనం ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించ లేదు. ఎన్నికలు జరగడంపై అనేక ట్విస్టులు రావడంతో జనం ఓట్ల పండగని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సైతం ఎన్నికలని బహిష్కరించడంతో, ఆ పార్టీకి ఉన్న ఓటర్లు, ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినటpawan kalyan;godavari river;janasena;west godavari;tdp;ycp;janasena partyవైసీపీకి పోటీగా జనసేన....ఓటింగ్ శాతం తేల్చేసిందా?వైసీపీకి పోటీగా జనసేన....ఓటింగ్ శాతం తేల్చేసిందా?pawan kalyan;godavari river;janasena;west godavari;tdp;ycp;janasena partySat, 10 Apr 2021 02:00:00 GMTఏపీలో అనేక ట్విస్టుల మధ్య పరిషత్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో 60 శాతం వరకే పోలింగ్ నమోదైంది. అయితే 2014లో 80 శాతం పైనే పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈ సారి పల్లె జనం ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించ లేదు. ఎన్నికలు జరగడంపై అనేక ట్విస్టులు రావడంతో జనం ఓట్ల పండగని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సైతం ఎన్నికలని బహిష్కరించడంతో, ఆ పార్టీకి ఉన్న ఓటర్లు, ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినట్లు లేరు.


అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తం 60 శాతం వరకు పోలింగ్ నమోదైతే, జిల్లాల వారీగా అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 68 శాతంపైనే ఓటింగ్ పడింది. అంటే ఇక్కడ జనం ఈ స్థాయిలో ఓట్లు వేయడానికి కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మామూలుగా రాష్ట్రం మొత్తం వైసీపీ ఆధిపత్యం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకే జనం మద్ధతు ఎక్కువగా ఉంది. ఇక ఆ తర్వాత టీడీపీకి జనం సపోర్ట్ ఉంది. కానీ జనసేన కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపుతుంది. అందులో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన బలంగానే ఉంది.


టీడీపీ ఎన్నికలని బహిష్కరించడంతో ఇక్కడ వైసీపీకి పోటీగా జనసేన వచ్చింది. అందుకు తగ్గట్టుగానే జనసేన మద్ధతుదారులు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీకి సపోర్ట్ చేసేవారు కూడా చాలాచోట్ల జనసేనకు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మొత్తానికి ఈ జిల్లాలో వైసీపీ-జనసేనల మధ్య పోటీ జరిగిందని చెప్పొచ్చు. అలాగే కొన్నిచోట్ల వైసీపీకి ధీటుగా జనసేన ఓట్లు తెచ్చుకుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. చూడాలి మరి పశ్చిమ గోదావరిలో ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ ఫాన్స్ కి ఈ రివ్యూ నచ్చదు కచ్చితంగా... అంత మాట అనేసాడు మరి...!

వకీల్ సాబ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా పుష్ప.....

వకీల్ సాబ్ కోసం కొత్త వకీల్ ?

వకీల్ సాబ్ ఇదే ఊపు కొనసాగితే బాహుబలి రికార్డులు బద్దలవ్వడం ఖాయం...

వకీల్ సాబ్ మూవీ భవితవ్యం తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే...?

నాలుగు షో లు మాత్రమే... పవన్ కు షాక్ ఇచ్చిన మంత్రి

వకీల్ సాబ్ లో కనబడే హీరో పవన్ అయితే కనపడని హీరో అతనేనటా...!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>