PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp09dc3dfa-b0d2-4b12-9ff4-75f7b55f7547-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp09dc3dfa-b0d2-4b12-9ff4-75f7b55f7547-415x250-IndiaHerald.jpgఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అధికార వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లోనే అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ, రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉంది. ఇక ప్రతిపక్ష టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంత కష్టపడినా, టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా ప్రజలు జగన్‌నే గట్టిగా నమ్ముతున్నారు.ysrcp;venkatesh;tiru;jagan;andhra pradesh;2019;tdp;local language;ycp;lie;partyవన్‌సైడ్ విక్టరీ దెబ్బవేస్తుందా?వన్‌సైడ్ విక్టరీ దెబ్బవేస్తుందా?ysrcp;venkatesh;tiru;jagan;andhra pradesh;2019;tdp;local language;ycp;lie;partyFri, 09 Apr 2021 01:00:00 GMT

ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అధికార వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లోనే అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ, రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉంది. ఇక ప్రతిపక్ష టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంత కష్టపడినా, టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా ప్రజలు జగన్‌నే గట్టిగా నమ్ముతున్నారు.


జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. అలాగే ఆయన చేస్తున్న పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. అందుకే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి వన్‌సైడ్ విజయాలు అందించారు. ఇక ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తెలుస్తోంది. పైగా టీడీపీ కూడా ఎన్నికలని బహిష్కరించడంతో వైసీపీకి తిరుగుండదని తెలుస్తోంది. దాదాపు 90 శాతం స్థానాలు వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


అయితే ఇలా వన్‌సైడ్ విజయాలు సాధించడం వల్ల, భవిష్యత్‌లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఎందుకంటే ఇంకా ప్రజలు జగన్‌ని చూసే ఓట్లు వేస్తున్నారు. ఒకవేళ ప్రజలు స్థానిక నాయకులని చూసి ఓట్లు వేస్తే, వైసీపీకి ఇలాంటి విజయాలు దక్కవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పనితీరు బాగుంటే, మరికొందరి పనితీరు సరిగ్గా లేదని తెలుస్తోంది.


ఆ ఎమ్మెల్యేలు ఇప్పటికీ జగన్ ఇమేజ్ మీద ఆధారపడి బండి లాగిస్తున్నారని తెలుస్తోంది.  అందుకే రాష్ట్రంలో ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా వైసీపీకి మంచి విజయాలు వస్తున్నాయి. ఇక విజయాలని చూసి వైసీపీ నేతలు పొంగిపోయి, లైట్ తీసుకుంటే, వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో టీడీపీ నేతలు పుంజుకుంటే వైసీపీకి మరిన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి విజయాలని చూసి వైసీపీ నేతలు మురిసిపోకుండా ప్రజల కోసం పనిచేస్తే, భవిష్యత్‌లో ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>