PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasena7d6ef457-0f76-4484-9fda-a0febee26d6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasena7d6ef457-0f76-4484-9fda-a0febee26d6d-415x250-IndiaHerald.jpgతిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో జనసేన ఓటర్లు కీలకంగా కానున్నారా? అంటే ప్రస్తుతానికైతే పెద్ద కీలకం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పార్టీ విజయం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీ కోసం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇక వైసీపీ తర్వాత టీడీపీకి గట్టిగానే ఓట్లు పడతాయని విశ్లేషణలు వస్తున్నాయి.janasena;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;2019;tirupati;parliment;husband;tdp;ycp;janasena party;partyతిరుపతిలో జనసైనికులు రూట్ మార్చారా?తిరుపతిలో జనసైనికులు రూట్ మార్చారా?janasena;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;2019;tirupati;parliment;husband;tdp;ycp;janasena party;partyFri, 09 Apr 2021 02:00:00 GMT

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో జనసేన ఓటర్లు కీలకంగా కానున్నారా? అంటే ప్రస్తుతానికైతే పెద్ద కీలకం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పార్టీ విజయం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీ కోసం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇక వైసీపీ తర్వాత టీడీపీకి గట్టిగానే ఓట్లు పడతాయని విశ్లేషణలు వస్తున్నాయి.


అయితే ఆ ఓట్లు వైసీపీ మెజారిటీ తగ్గించేలా ఉంటాయా? లేదా? అనేదే ప్రశ్న. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీపై వైసీపీకి దాదాపు 2 లక్షలపైనే మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ మెజారిటీని తగ్గిస్తే వైసీపీ హవాని టీడీపీ తగ్గించినట్లే. కానీ ఇక్కడ బీజేపీ పోటీలో ఉండటం వల్ల టీడీపీకే ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తుంది. ఒకవేళ జనసేన ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడితే టీడీపీకి ఓట్లు తగ్గుతాయి.


ఎందుకంటే తిరుపతిలో పవన్ కల్యాణ్ సొంత సామాజికర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక వీరిలో వైసీపీ, టీడీపీలకు సపోర్ట్ చేసేవారు ఎక్కువే. అలాగే జనసేన ఈ ఓట్లని పంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన లేకపోతే ఆ ఓట్లు టీడీపీకే పడతాయని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పుడు బీజేపీకి జనసేన వాళ్ళు ఏ స్థాయిలో ఓట్లు వేస్తారనేది ప్రధాన ప్రశ్న. జనసేన ఓట్లు పూర్తిగా బీజేపీకి వెళితే, టీడీపీకి నష్టం జరిగి, వైసీపీకి మేలు జరుగుతుంది.


అలా కాకుండా జనసేనకు వేయాలనుకునేవారు టీడీపీకి ఓట్లు వస్తే, బీజేపీకి నష్టం జరుగుతుంది. అలాగే వైసీపీ మెజారిటీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో బీజేపీకి ఓట్లు వేస్తే ఉపయోగం లేదని, వైసీపీకి ఓట్లు వేస్తే, అప్పుడు కూడా మెజారిటీ లెక్క మారుతుంది. కాబట్టి జనసైనికులు బట్టే వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందనేది ఆధారపడి ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి తిరుపతి పోరులో జనసేన ఓటర్లు ఎటువైపు ఎక్కువ మొగ్గుచూపుతారో.   





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>