PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp8842543a-6d84-4cb4-aeb9-c059e765aabd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp8842543a-6d84-4cb4-aeb9-c059e765aabd-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు విఫలమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి జగన్‌ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు వేసే ప్రతి ఎత్తుగడ ఫెయిల్ అవుతుంది. ఇక ఆ వ్యూహాలు తిరిగి జగన్‌కే అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇలా ఎన్ని ఫెయిల్ అయినా సరే బాబు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కూడా బాబు సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు.tdp;view;korcha;2019;cycle;tdp;ycpతేలిపోయిన సైకిల్...తమ్ముళ్ళు కూడా షాక్ ఇచ్చేశారుగా!తేలిపోయిన సైకిల్...తమ్ముళ్ళు కూడా షాక్ ఇచ్చేశారుగా!tdp;view;korcha;2019;cycle;tdp;ycpFri, 09 Apr 2021 03:00:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు విఫలమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి జగన్‌ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు వేసే ప్రతి ఎత్తుగడ ఫెయిల్ అవుతుంది. ఇక ఆ వ్యూహాలు తిరిగి జగన్‌కే అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇలా ఎన్ని ఫెయిల్ అయినా సరే బాబు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కూడా బాబు సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు.


ఎలాగో రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉందని తెలుసుకుని, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతోనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ బాబు వ్యూహానికి ఓ చిక్కు వచ్చి పడింది. ఎన్నికలని బహిష్కరించడం వల్ల, ఎప్పటినుంచో ఉన్న టీడీపీ ఓటర్లని దూరం చేసుకునే పరిస్తితి వచ్చింది.


ఎన్నికలని బహిష్కరించడం వల్ల చాలాచోట్ల టీడీపీ ఓటర్లు, ఫ్యాన్‌కు ఓటు వేశారని తెలుస్తోంది. దీనికితోడు గతేడాదే నామినేషన్స్ వేయడంతో, చాలాచోట్ల టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అయితే బాబు తీసుకున్న నిర్ణయం వల్ల, ఆ అభ్యర్ధులకు కూడా చాలా నష్టం జరిగింది. ఎందుకంటే టీడీపీ పోటీలో ఉన్నా సరే ఎలాగో గెలవదని చెప్పి, పలువురు టీడీపీ ఓటర్లు, వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు  తెలుస్తోంది.


పైగా టీడీపీ ఎన్నికలని బహిష్కరించినా కూడా, పెద్ద ఎత్తున ఓట్ల శాతం తగ్గినట్లు లేదు. దీని బట్టి చూస్తే బాబు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల, కింది స్థాయిలో ఉన్న టీడీపీ కేడర్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇలా వైసీపీకి ఓటు వేసినవారు, అలాగే కంటిన్యూ అయితే, భవిష్యత్‌లో టీడీపీకి భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే బాబు ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని చెప్పి, అనాదిగా వస్తున్న టీడీపీ ఓటర్లని సైతం దూరం చేసుకునే పరిస్థితికి తెచ్చుకున్నారు. మొత్తానికైతే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలో బాబు వ్యూహం దారుణంగా విఫలమైందనే చెప్పొచ్చు. 





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>