PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp57784ac2-af45-4881-8c49-db079560bb16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp57784ac2-af45-4881-8c49-db079560bb16-415x250-IndiaHerald.jpgఏపీలో ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా వైసీపీ హవా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా వైసీపీ ప్రతి జిల్లాలోనూ సత్తా చాటింది. అలాగే ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైసీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. ఇక పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి వన్‌సైడ్ విక్టరీనే దక్కనుంది.tdp;2019;district;vishakapatnam;assembly;cheque;tdp;local language;ycp;pendurthi;payakaraopeta;petta;bheemili;partyఅక్కడ టీడీపీ పట్టు బిగించేస్తుందా?అక్కడ టీడీపీ పట్టు బిగించేస్తుందా?tdp;2019;district;vishakapatnam;assembly;cheque;tdp;local language;ycp;pendurthi;payakaraopeta;petta;bheemili;partyThu, 08 Apr 2021 04:00:00 GMT

ఏపీలో ఆ జిల్లాజిల్లా అనే తేడా లేకుండా వైసీపీ హవా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా వైసీపీ ప్రతి జిల్లాలోనూ సత్తా చాటింది. అలాగే ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైసీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. ఇక పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి వన్‌సైడ్ విక్టరీనే దక్కనుంది.


ఇలా రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉండటంతో టీడీపీకి పెద్దగా పుంజుకునే అవకాశాలు దక్కడం లేదు. ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీ డామినేషన్ కనిపిస్తోంది. అయితే కీలకమైన విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కాస్త పట్టు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు  గెలుచుకుంది.


అది కూడా విశాఖ నగరంలో ఉన్న నాలుగు సీట్లు. రూరల్‌లో మాత్రం మొత్తం సీట్లు వైసీపీనే కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు టీడీపీకి నగరంలో పట్టు తగ్గుతుంది. నాలుగు అసెంబ్లీ సీట్లలో టీడీపీ బలం తగ్గి, వైసీపీ బలం పెరిగింది. ఇదే సమయంలో రూరల్‌లో టీడీపీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా భీమిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి కాస్త పట్టు దక్కినట్లు తెలుస్తోంది. అలా అని చెప్పి వైసీపీకి చెక్ పెట్టే స్థాయిలో టీడీపీ పుంజుకోలేదు.


వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం కాస్త కష్టమవుతుంది. కానీ టీడీపీ నేతలు కూడా గట్టిగానే పోరాడుతున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళుతున్నారు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అందుకే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటలేకపోయింది. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి చెక్ పెట్టే విధంగా టీడీపీ నేతలు ముదుకెళుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో విశాఖ రూరల్‌లో టీడీపీ ఏ మేర సత్తా చాటుతుందో? 





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప సినిమా డబ్బింగ్ పనులను షురూ చేసిన చిత్ర బృందం...?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>