PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-2021b8b30282-a8c4-42b4-b237-201838d07fc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-2021b8b30282-a8c4-42b4-b237-201838d07fc3-415x250-IndiaHerald.jpgఎన్నికల నిర్వహణ పై నిన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నేడు ఉదయం నుంచే ఎన్నికలు జరగనున్నాయి.జిల్లాలో పరిషత్తు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 50 మండలాలకుగానూ 26 మండలాల పరిధిలోని 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.ఇకపోతే జిల్లాలో మొత్తం 50 జడ్పీటీసీలు, 554 ఎంపీటీసీ స్థానాలకు గతేడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ap-zptc-mptc-elections-2021;bhanu;bharatiya janata party;tdpకడపలో మొదలైన పరిషత్ పోరు..గెలుపు ఎవరిది?కడపలో మొదలైన పరిషత్ పోరు..గెలుపు ఎవరిది?ap-zptc-mptc-elections-2021;bhanu;bharatiya janata party;tdpThu, 08 Apr 2021 07:00:00 GMT

నామపత్రాల ఉపసంహరణ ముగిసేనాటికి 38 జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. వాటిలో వైకాపా 417 మంది, తెదేపా 9 మంది, భాజపా ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మరో అయిదు ఎంపీటీసీ స్థానాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించట్లేదు. కొండాపురం మండలం సుగుమంచిపల్లె-1, 2, ఓబన్నపేట, సుండుపల్లి మండలం సొంటంవారిపల్లె, ప్రొద్దుటూరు మండలం నాగనూరుపల్లె ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.


మొత్తం 634 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సాధారణం 427, సమస్యాత్మకం 86, అత్యంత సమస్యాత్మకం 121 ఉన్నాయి. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌తోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 6,047 మంది ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో పీవోలు 847, ఏపీవోలు 844, ఓపీవోలు 2,561, రూట్‌ అధికారులు 98, జోనల్‌ అధికారులు 72, సూక్ష్మ పరిశీలకులు 153, మాస్టర్‌ ట్రైనర్లు 128, నాలుగోతరగతి సిబ్బంది 1,268, వెబ్‌క్యాస్టింగ్‌ సిబ్బంది 76 మంది ఉన్నారు.. నిన్న సాయంత్రమే ఎన్నికలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ ల దగ్గరకు ఓట్లర్లు వస్తున్నారు. భానుడి ప్రతాపం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నానికి 80 శాతం పోలింగ్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు...


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్కు ధ‌రించ‌కుంటే జైలే....258 మంది అరెస్టు...

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>