PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-elections-79d3147b-6cb9-46e6-b85d-bbf70be0c1d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-elections-79d3147b-6cb9-46e6-b85d-bbf70be0c1d5-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి ప్రతీ ఎన్నికా ఇపుడు చావో రేవో అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పుకోవాలిపుడు. టీడీపీ పని అయిపోయింది అన్న వారికి కూడా గట్టి జవాబు ఇవ్వాల్సిన సమయం కూడా ఇదే. దాని కోసమే తండ్రీ కొడుకులు ఏకంగా హైదరాబాద్ నుంచి రూట్ మార్చి మరీ తిరుపతికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి ఈ ఉప ఎన్నిక ఎంత ప్రాణప్రదమో చెప్పాలంటే చాలా కారణాలే చూడాలి.tirupati elections;tiru;hyderabad;district;telugu;panchayati;assembly;minister;air;tdp;local language;ycp;march;izzat;dookudu;partyతిరుపతిలో టీడీపీ అనూహ్యంగా పుంజుకుందా...?తిరుపతిలో టీడీపీ అనూహ్యంగా పుంజుకుందా...?tirupati elections;tiru;hyderabad;district;telugu;panchayati;assembly;minister;air;tdp;local language;ycp;march;izzat;dookudu;partyThu, 08 Apr 2021 16:47:38 GMTతెలుగుదేశం పార్టీకి ప్రతీ ఎన్నికా ఇపుడు చావో రేవో అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పుకోవాలిపుడు. టీడీపీ పని అయిపోయింది అన్న వారికి కూడా గట్టి జవాబు ఇవ్వాల్సిన సమయం కూడా ఇదే.

దాని కోసమే తండ్రీ కొడుకులు ఏకంగా హైదరాబాద్ నుంచి రూట్ మార్చి మరీ తిరుపతికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి ఈ ఉప ఎన్నిక ఎంత ప్రాణప్రదమో చెప్పాలంటే చాలా కారణాలే చూడాలి. మొదటిది చూస్తే చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా. మరి అక్కడ జెండా పాతేసి మేమే హీరోలమని పంచాయతీ మునిసిపాలిటీ ఎన్నికల వేళ వైసీపీ మీసం మెలేసింది.

సరే అవి స్థానిక ఎన్నికలు. కానీ ఇక్కడ జరిగేది లోక్ సభకు ఉప ఎన్నిక. పైగా ఏడు అసెంబ్లీ సీట్ల నుంచి జనాలు తమ అభిప్రయాలను వ్యక్తం చేస్తారు అంటున్నారు. మరోవైపు చూస్తే తిరుపతిలో గెలవడం ఇజ్జత్ మే సవాల అన్నట్లుగా టీడీపీకి ఉంది. గతంలో రెండు సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఈసారి మాత్రం గెలిచి తీరాలి. లేకపోతే వైసీపీ మెజారిటీ అయినా గణనీయంగా తగ్గించాలి.

ఈ లక్ష్యంతోనే టీడీపీ ఇక్కడ బరిలోకి దిగింది. మరో వైపు చూస్తే ఏడు అసెంబ్లీ సీట్లు వైసీపీ చేతిలో ఉన్నాయన్న మాటే కానీ అందులో నాలుగింటిలో వైసీపీకి ఇపుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు అదే టీడీపీకి అతి పెద్ద బలంగా మారుతోంది. తిరుపతిలో వైసీపీ బలం తగ్గింది. అలాగే గూడూరు, సుళ్ళూరు పేటలల్లో కూడా ఫ్యాన్ గాలి తగ్గింది. ఇక సర్వేపల్లిలో  మాజీ మంత్రి చంద్రమోహనరెడ్డి గట్టిగానే పోరాడుతున్నారు. టీడీపీకి ఎక్కువ ఓట్లు తేవడానికి ఆయన కృషి చేస్తున్నారు. వెంకటగిరిలో వైసీపీ తరఫున  గెలిచిన ఆనం రామ‌నారాయణరెడ్డి రెండేళ్ళుగా పెద్దగా అక్కడ ఉండడంలేదని టాక్. దాంతో అక్కడ వైసీపీ నీరసించింది. దాంతో ఈ నాలుగుచోట్ల‌ బలం సంపాదించి అధికార వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ చూస్తోంది.






ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏప్రిల్ నెల పవన్ కళ్యాణ్ కి ఈసారి కలిసిస్తుందా????

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>