PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-announce-relief-to-teachers9c9b486f-c363-4800-a254-7af6c029ae0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-announce-relief-to-teachers9c9b486f-c363-4800-a254-7af6c029ae0f-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.kcr announce relief to teachers;kcr;sekhar;telangana;district;chief minister;good news;letter;local language;march;good newwzప్రైవేట్ టీచర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్ప్రైవేట్ టీచర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్kcr announce relief to teachers;kcr;sekhar;telangana;district;chief minister;good news;letter;local language;march;good newwzThu, 08 Apr 2021 19:34:58 GMTకరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడం తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని  గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కి  నెలకు రెండు వేల రూపాయల ఆపత్కాల  ఆర్ధిక సాయం తో పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు.ఇందుకు సంబంధించి ప్రయివేటు  విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో  స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు.

ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ  విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సిఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కి లబ్ధిచేకూరుతుంది.

కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది మార్చి లో స్కూల్స్ , కాలేజీలు మూతపడగా.. అందులో పని చేసే అద్యాపకులు, సిబ్బంది రోడ్డున పడ్డారు. వాళ్లు పనిచేసే .యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా కరోనా వ్యాప్తితో మరోసారి విద్యాసంస్థలు మూసివేయడంతో... వాళ్లకు మళ్లీ కష్టాలు వచ్చాయి.

మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రయివేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్.. ట్రస్మా కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పరీక్ష కేెంద్రాల కోసం భవనాలు ఇవ్వకూడదని ట్రస్మా నిర్ణయించింది. సహాయ నిరాకరణ ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలుపాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించింది. సమస్యలను పరిష్కరిస్తేనే పరీక్షల కోసం సెంటర్లు ఇస్తామని ముక్త కంఠంతో ప్రభుత్వానికి చెప్పాలని రాష్ట్రంలోని పాఠశాలల కరస్పాండెంట్లకు లేఖ రాశారు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల రాకతో మారుతున్న మత రాజకీయాలు..!!

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>