PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuba3c83f9-0c22-444c-81f1-9f568c101cbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuba3c83f9-0c22-444c-81f1-9f568c101cbb-415x250-IndiaHerald.jpgచిత్తూరు జిల్లా...టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. అవ్వడానికి బాబు సొంత జిల్లా అయినా సరే...ఇక్కడ డామినేషన్ మొత్తం వైసీపీదే. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికలు కావొచ్చు, జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికలు కావొచ్చు...చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 2014లో జిల్లాలో టీడీపీ 6 సీట్లు గెలుచుకుంటే, వైసీపీ 8 గెలుచుకుంది.chandrababu;cbn;jagan;2019;district;peddireddy ramachandra reddy;kuppam;minister;air;cheque;tdp;ycp;punganurపెద్దిరెడ్డి పాలిటిక్స్: బాబు కుప్పం వదిలేయాల్సిందేనా?పెద్దిరెడ్డి పాలిటిక్స్: బాబు కుప్పం వదిలేయాల్సిందేనా?chandrababu;cbn;jagan;2019;district;peddireddy ramachandra reddy;kuppam;minister;air;cheque;tdp;ycp;punganurWed, 07 Apr 2021 00:00:00 GMTచిత్తూరు జిల్లా...టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. అవ్వడానికి బాబు సొంత జిల్లా అయినా సరే...ఇక్కడ డామినేషన్ మొత్తం వైసీపీదే. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికలు కావొచ్చు, జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికలు కావొచ్చు...చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 2014లో జిల్లాలో టీడీపీ 6 సీట్లు గెలుచుకుంటే, వైసీపీ 8 గెలుచుకుంది.


ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. జిల్లాలో 13 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. కేవలం కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలిచారు. అయితే ప్రస్తుతం రాష్ట్రమంతా జగన్ హవా నడుస్తోంది. దీంతో ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా ఎక్కడ చూసిన వైసీపీ డామినేషన్ ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉంది.


ఈయనే జిల్లాలో వైసీపీ మరింత బలంగా తయారయ్యేలా చేశారు. అలాగే చంద్రబాబుకు చెక్ పెడుతూ కుప్పం రాజకీయాలని కూడా మార్చేశారు. పెద్దిరెడ్డి మంత్రి అయిన దగ్గర నుంచి తన సొంత నియోజకవర్గం పుంగనూరుపై ఎంత ఫోకస్ పెట్టారో తెలియదు గానీ, బాబు సొంత నియోజకవర్గం కుప్పంపై మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఇక్కడ చాలావరకు టీడీపీ ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని వైసీపీలోకి తీసేసుకున్నారు.


అలాగే పంచాయితీ ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీని గెలిపించారు. వైసీపీ భారీ స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో పంచాయితీలు గెలుచుకుంది. ఇలా ఫలితాలు వచ్చిన వెంటనే బాబు కుప్పానికి వెళ్ళి, పార్టీని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా కుప్పంలో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పారిపోయేలా పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని పెద్దిరెడ్డి చెబుతున్నారు. మరి చూడాలి కుప్పంలో వైసీపీ భారీగా పరిషత్ ఎన్నికల్లో గెలిస్తే, బాబు కుప్పం నుంచి వెళ్లిపోతారో లేదో. 





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>