PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-there-a-twist-in-vijayamma-letterfd3b3574-822d-4eae-96c8-48c4dba53025-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-there-a-twist-in-vijayamma-letterfd3b3574-822d-4eae-96c8-48c4dba53025-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. అయితే ముందు ఆయన గుండెపోటుతో చనిపోయారని మీడియాకి సమాచారం వచ్చింది. ఇక ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యే సమయంలో సంచలన విషయాలు బయటపడుతూ వచ్చాయి.. ఆయన రక్తపు మడుగులో పడి ఉండడం, ఆయనను నరికిన ఆనవాళ్ళు కనిపించడంతో ఆయన సన్నిహితులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ చేయగా ఆయనని కత్తులతో నరికి చంపినట్లు తేలిందిap politics;jagan;2019;telugu;police;media;chief minister;y s vivekananda reddy;assembly;minister;doctor;letter;murder.;ycp;father;march;reddyవిజయమ్మ లేఖలో ట్విస్ట్ ఉందా..?విజయమ్మ లేఖలో ట్విస్ట్ ఉందా..?ap politics;jagan;2019;telugu;police;media;chief minister;y s vivekananda reddy;assembly;minister;doctor;letter;murder.;ycp;father;march;reddyTue, 06 Apr 2021 20:07:14 GMT గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. అయితే ముందు ఆయన గుండెపోటుతో చనిపోయారని మీడియాకి సమాచారం వచ్చింది. ఇక ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యే సమయంలో సంచలన విషయాలు బయటపడుతూ వచ్చాయి.. ఆయన రక్తపు మడుగులో పడి ఉండడం, ఆయనను నరికిన ఆనవాళ్ళు కనిపించడంతో ఆయన సన్నిహితులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ చేయగా ఆయనని కత్తులతో నరికి చంపినట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివేకా హత్య రాజకీయంగా పెను దుమారం రేపింది.

అయితే బాబాయ్ ని జగన్ చంపుకున్నానాడని తెలుగుదేశం నేతలు ఆరోపించగా, లేదు తెలుగు దేశం నేతలే చంపారని వైసీపీ నేతలు ఆరోపించుకున్నారు. దీంతో అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సిట్‌ ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఇక ఇంతలోనే ఎన్నికలు రావడం చంద్రబాబు ఓటమి పాలు అయ్యి వైఎస్ జగన్ సి‌ఎం కావడం చకచకా జరిగిపోయాయి. అయితే జగన్ సి‌ఎం అయిన తరువాత ఈ కేసు పూర్తిగా మరుగునపడింది. ఈ నేపథ్యంలో తాజాగా వివేకా కూతురు డాక్టర్ సునీత తన తండ్రి మరణించి రెండేళ్ళు అయినప్పటికి ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ డిల్లీ పోలీసునను ఆశ్రయించడంతో వివేకా హత్య కేసుపై మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో కొత్త చర్చ మొదలైంది.

 లేఖలో ఆమె మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో కచ్చితంగా గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇది తనతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఇందులో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవన్నారు. హత్య కేసు దర్యాప్తు విషయంలో కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయమ్మ సోమవారం అయిదు పేజీల సుధీర్ఘ బహిరంగ లేఖ రాశారు. అయితే విజయమ్మ రాసిన లేఖపై కొన్ని అనుననాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లేఖలో ఆమె సంతకం లేకపోవడంతో ఆమెనే రాసిందా లేక వేరే ఎవరైనా రాసి ఆమె పేరుమీద బయటపెట్టరా అనే కోణంలో కూడా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి వివేకా హత్య కేసు మరొకసారి తెరపైకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది..



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందంగా అంజలి...ముంబై ఎందుకు ఇంక ?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>