SpiritualityGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd4ffd54df-5f8b-4f53-84ad-8c00296ab50b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd4ffd54df-5f8b-4f53-84ad-8c00296ab50b-415x250-IndiaHerald.jpg తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల‌ 13న ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ విష‌యాన్ని మీడియాకు తెలియ‌జేశారు. ttd;kasthuri;tiru;tirupati;reddy;tirumala tirupathi devasthanamకోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంకోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంttd;kasthuri;tiru;tirupati;reddy;tirumala tirupathi devasthanamTue, 06 Apr 2021 13:10:16 GMT
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల‌ 13న ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ప్ర‌తి ఏడాది నిర్వ‌హించిన‌ట్లుగానే ఈ ఏడాది కూడా నిర్వ‌హించామ‌ని, క‌రోనాను దృష్టిలో పెట్టుకొని జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ విష‌యాన్ని మీడియాకు తెలియ‌జేశారు.

సంవ‌త్స‌రానికి నాలుగుసార్లు నిర్వ‌హిస్తారు
సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈవో చెప్పారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తుంటారు. స్వామివారి మూలవిరాట్టును శ్వేతవస్త్రంతో పూర్తిగా కప్పి, నంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమే ప్ర‌తి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. వేకువ‌జామున స్వామివారికి సుప్ర‌భాతం, అర్చ‌న సేవ‌ల అనంత‌రం శ్రీ‌వారి మూల‌విరాట్‌పై ప‌ట్టువస్త్రంతో అర్చ‌కులు పూర్తిగా క‌ప్పేశారు. సుగంధ ద్ర‌వ్యాలు క‌లిపిన ప‌విత్ర జ‌లంతో ఆల‌యం లోప‌ల‌, బ‌య‌ట శుద్ధి గావించారు.

ఆల‌య గోడ‌ల సంప్రోక్ష‌ణ‌
నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ గోడలకు ప్రోక్షణ చేశారు. తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్రశాంత్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.



వామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>