PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-bye-poll-very-interesting-197c8c0d-f8a6-499b-b7aa-9182a05f5f07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-bye-poll-very-interesting-197c8c0d-f8a6-499b-b7aa-9182a05f5f07-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల ఘట్టం ఇపుడు ఒక స్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి వెళ్లారు. తెలుగుదేశం తరఫున లోకేష్ రంగంలోకి దిగిపోయారు. రేపో మాపో చంద్రబాబు కూడా ప్రచారానికి వస్తారు. tpt bye poll;pawan;lokesh;kalyan;tiru;bharatiya janata party;mp;telugu;tirupati;husband;tdp;local language;ycp;lokesh kanagaraj;party;mantraతిరుపతిలో డిపాజిట్లు పోయేది ఎవరికి ?తిరుపతిలో డిపాజిట్లు పోయేది ఎవరికి ?tpt bye poll;pawan;lokesh;kalyan;tiru;bharatiya janata party;mp;telugu;tirupati;husband;tdp;local language;ycp;lokesh kanagaraj;party;mantraMon, 05 Apr 2021 20:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల ఘట్టం ఇపుడు ఒక స్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి వెళ్లారు. తెలుగుదేశం తరఫున లోకేష్ రంగంలోకి దిగిపోయారు. రేపో మాపో చంద్రబాబు కూడా ప్రచారానికి వస్తారు.

ఇక మరో పది రోజులు మాత్రమే తిరుపతి ఎన్నికల ప్రచారం సాగనుంది. ఈ నెల 17న పోలింగ్ నిర్వహిస్తారు. దాంతో తిరుపతి ఉప ఎన్నికల వేడి చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. అధికార వైసీపీ మంత్రులకే మొత్తం బాధ్యతలు అప్పగించేసింది. అదే విధంగా ప్రతీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలను సీనియర్ నాయకులను ఇంచార్జిలుగా పెట్టుకుంది. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని అంతా దాదాపుగా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే అద్భుతాలు జరిగిపోయే ఎన్నిక ఇది కాదు. పైగా వైసీపీ సిట్టింగ్ ఎంపీ కరోనాతో మరణించారు. దాంతో వైసీపీ సీటు తానే తిరిగి తెచ్చుకుంటుంది అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీకి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం దక్కింది. అదే ట్రెండ్ ఈ ఎన్నికల్లో కంటిన్యూ అవుతుంది అని భావిస్తున్నారు.

అయితే మెజారిటీ విషయంలోనే వైసీపీ గట్టి పట్టుదలగా ఉంది. అయిదు లక్షల మెజారిటీ సాధించాలని కూడా భావిస్తోంది. దాని కోసమే వైసీపీ తిష్ట వేసి మరీ పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తోంది. మరో వైపు టీడీపీకి డిపాజిట్లు రాకుండా ఎగరగొట్టాలన్నది కూడా వైసీపీ ఆలోచన. టీడీపీ ఇప్పటికే పరిషత్ ఎన్నికలను బహిష్కరించి తప్పు చేసింది అన్న ఫీలింగ్ ఆ పార్టీ నేతల్లో ఉంది. దాంతో తిరుపతి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా చేస్తే అది టీడీపీ మరింత దెబ్బ తినిపోవడానికి కారణం అవుతుంది అంటున్నారు. ఇంకోవైపు బీజేపీ నోటాతోనే పోటీ పడుతుంది అని అంటున్నారు వైసీపీ నేతలు. అంటే విపక్షాలకు డిపాజిట్లు రాకుండా మొత్తనికి మొత్తం ఓట్లు తమ ఖాతాలో వేసుకుని కొత్త రాజకీయానికి తెర తీయాలని వైసీపీ చూస్తోంది అన్న మాట.





రైతుతో కేసీఆర్‌.. నేలపై అద్భుత చిత్రపటం

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>