Rashmika Mandanna’s First Look Launched From Sharwanand’s Aadavaallu Meeku Johaarlu Movie

శర్వానంద్, కిషోర్ తిరుమల, ఎస్ఎల్ వి సినిమాస్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం నుండి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల

శర్వానంద్, రష్మిక మందన్న జంట‌గా ఫస్ట్ టైం తిరుమల కిషోర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం

ఈ రోజు (ఏప్రిల్ 5) హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో ..

 

పసుపు రంగు చీర కట్టుకుని చిరునవ్వు నవ్వుతూ గార్డెన్ లో కూర్చొని దేవుడి కోసం బంతిపూలదండ క‌డుతున్న ర‌ష్మిక మంద‌న్న లుక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి సంభందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.