PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyand986b112-9a7b-4f16-8253-2a540f220c59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyand986b112-9a7b-4f16-8253-2a540f220c59-415x250-IndiaHerald.jpgఏపీలో జరగనున్న ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటే, టీడీపీ కార్యకర్తలు షాకింగ్ నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. ఊహించని విధంగా చంద్రబాబు, పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉండటం అనివార్యమే.pawan kalyan;cbn;kumaar;janasena;tdp;ycp;janasena party;shatru1తమ్ముళ్ళ షాకింగ్ డెసిషన్...వైసీపీ తర్వాత స్థానం జనసేనదే..?తమ్ముళ్ళ షాకింగ్ డెసిషన్...వైసీపీ తర్వాత స్థానం జనసేనదే..?pawan kalyan;cbn;kumaar;janasena;tdp;ycp;janasena party;shatru1Sun, 04 Apr 2021 03:00:00 GMT

ఏపీలో జరగనున్న ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటే, టీడీపీ కార్యకర్తలు షాకింగ్ నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. ఊహించని విధంగా చంద్రబాబు, పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉండటం అనివార్యమే.


ఎందుకంటే పరిషత్ ఎన్నికలకు గతేడాదే నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే నామినేషన్ ప్రక్రియ, ఉపసంహరణ, అభ్యర్ధులు ఫైనలైజ్ అవ్వడం జరిగిపోయాయి. ఇక ఎన్నికలే జరగాల్సిన తరుణంలో కోవిడ్ కారణంగా గత ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. అంటే టీడీపీ ఎన్నికలు బహిష్కరించినా, పోటీలో ఉండక తప్పదు.


అయితే చంద్రబాబు నిర్ణయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు సమర్ధిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా పోటీ చేస్తామని టీడీపీ కార్యకర్తలు చెప్పేస్తున్నారు. ఇక మరికొన్ని చోట్ల అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటున్నారు. పోటీలో లేకపోయినా సరే జనసేన అభ్యర్ధులని గెలిపించడానికి ఫిక్స్ అయిపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారంతా జనసేన వైపుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లో జనసేన ఓటింగ్ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీని ఓడించాలని కసితో ఉన్న తమ్ముళ్ళు, పవన్‌కు జై కొడుతున్నట్లు తెలుస్తోంది.


ఇదే సమయంలో జనసేనతో పొత్తులో పోటీ చేస్తున్న బీజేపీకి టీడీపీ ఓట్లు పడే అవకాశాలు అసలు కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీని ఎలాగైతే శత్రువుగా చూస్తున్నారో, అలాగే బీజేపీని కూడా టీడీపీ కార్యకర్తలు శత్రువులుగా భావిస్తున్నారు. దీని బట్టి చూస్తే టీడీపీ ఓటింగ్ జనసేనకు వెళుతుంది తప్పా, బీజేపీకి అసలు పడే అవకాశాలు లేవని అర్ధమవుతుంది. అయితే జనసేన వైపు వెళ్ళే టీడీపీ కేడర్, తర్వాత చంద్రబాబు వైపు వస్తారా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికైతే తమ్ముళ్ళు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జనసేనకు పట్టం కట్టేలా ఉన్నారు.





నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి

పవన్ విషయంలో బాబుపై వామపక్షాల ఒత్తిడి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>