PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani101f1854-fe2b-4c77-b689-838708f74112-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani101f1854-fe2b-4c77-b689-838708f74112-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే ఈ 40 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అతి పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అధికార వైసీపీ ఎన్నికల సమయంలో దౌర్జన్యాలకు పాల్పడుతుందని, తమ కార్యకర్తలని బాగా ఇబ్బంది పెడుతుందని, పైగా కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పూర్తిగా జగన్ మనిషి అని విమర్శలు చేస్తూ, చంద్రబాబు ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.kodali nani;tiru;telugu desam party;amarnath cave temple;krishna river;jagan;district;telugu;mandalam;minister;krishna district;tdp;ycp;partyబాబు నిర్ణయం కొడాలికి భలే కలిసొస్తుందిగా..బాబు నిర్ణయం కొడాలికి భలే కలిసొస్తుందిగా..kodali nani;tiru;telugu desam party;amarnath cave temple;krishna river;jagan;district;telugu;mandalam;minister;krishna district;tdp;ycp;partySun, 04 Apr 2021 00:00:00 GMT

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే ఈ 40 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అతి పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అధికార వైసీపీ ఎన్నికల సమయంలో దౌర్జన్యాలకు పాల్పడుతుందని, తమ కార్యకర్తలని బాగా ఇబ్బంది పెడుతుందని, పైగా కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పూర్తిగా జగన్ మనిషి అని విమర్శలు చేస్తూ, చంద్రబాబు ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.


అయితే గతేడాదే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. అలాగే నామినేషన్స్ ఉపసంహరణ కార్యక్రమం కూడా ముగిసింది. ఏకగ్రీవాలని సైతం ప్రకటించేశారు. ఇక గతేడాది ఎన్నికలు ఎక్కడ ఆపేశారో అక్కడ నుంచే నీలం సాహ్ని ఎన్నికలు నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. అంటే అప్పుడు టీడీపీ అభ్యర్ధులు కూడా పోటీలో ఉంటారు. కానీ ఎన్నికలు బహిష్కరిస్తున్నందున ప్రచారం నిర్వహించక పోవచ్చు.


అంటే టీడీపీ అభ్యర్ధులు వైసీపీకి అసలు పోటీనే ఉండరు. ఇలా టీడీపీ సైడ్ అవ్వడం వైసీపీకి ఇంకా ఫుల్ అడ్వాంటేజ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం మంత్రి కొడాలి నానికి బాగా ప్లస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో కొడాలికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. కానీ నియోజకవర్గంలో ఉన్న గుడ్లవల్లేరు మండలంలో వైసీపీకి పెద్ద బలం లేదు.


ఇక్కడ ఎప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మండలంలో ఎక్కువ సార్లు జెడ్‌పి‌టి‌సి స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీడీపీ తప్పుకోవడం వల్ల, వైసీపీ అభ్యర్ధికి ప్లస్ కానుంది. అయితే వైసీపీ తరుపున పోటీ చేసే గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి అభ్యర్ధి ఉప్పాల హారికనే కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్ధి కూడా. అంటే హారిక గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి స్థానంలో సులువుగా గెలిచేసి, జెడ్పీ పీఠంలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికైతే టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం కొడాలికి ఇంకా అడ్వాంటేజ్ కానుంది.





నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి

పవన్ విషయంలో బాబుపై వామపక్షాల ఒత్తిడి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>