PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-muncipa-elections-pavan-kalyan-ycp-jagan-534d5c66-3ae5-4dd9-a151-eb2e4e027d94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-muncipa-elections-pavan-kalyan-ycp-jagan-534d5c66-3ae5-4dd9-a151-eb2e4e027d94-415x250-IndiaHerald.jpgబి.జె.పి, జనసేన సభలో పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. వై.సి.పిలోని 151 మంది ఎం.ఎల్.ఏలు గుండా లాగా మాట్లాడుతున్నారు. వారి బెదిరింపులు, గుండాగిరి ఎక్కువైపోతోంది అని ఆయన ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిందనేందుకు ప్రత్యక్ష ఉధాహరణ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాక పోవటమే అని ఆయన ఆరోపించారు. సొంత చిన్నానను చంపిన దోషులను పట్టుకోలేదు. కోడికత్తి దోషులను ఎందుకు పట్టుకోలేదు అని ఆయాన నిలదీశారు. దీన్ని బట్టే రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతున్నాయని అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాpavan klayan,janasena,ap;pawan;janasena;y s vivekananda reddy;tiger;murder.;janasena party;reddyఎర్ర చందనంపై పవన్ సంచలన వ్యాఖ్యలుఎర్ర చందనంపై పవన్ సంచలన వ్యాఖ్యలుpavan klayan,janasena,ap;pawan;janasena;y s vivekananda reddy;tiger;murder.;janasena party;reddySun, 04 Apr 2021 07:00:00 GMTబి.జె.పి, జనసేన సభలో పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. వై.సి.పిలోని 151 మంది ఎం.ఎల్.ఏలు గుండా లాగా మాట్లాడుతున్నారు. వారి బెదిరింపులు, గుండాగిరి ఎక్కువైపోతోంది అని ఆయన ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిందనేందుకు ప్రత్యక్ష ఉధాహరణ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాక పోవటమే అని ఆయన ఆరోపించారు. సొంత చిన్నానను చంపిన దోషులను పట్టుకోలేదు. కోడికత్తి దోషులను ఎందుకు పట్టుకోలేదు అని ఆయాన నిలదీశారు. దీన్ని బట్టే రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతున్నాయని అన్నారు.

ఇలాంటి వ్యక్తులు రాజ్యాన్ని ఏలుతుంటే... సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఎర్ర చందనం లారీలు లారీలు ఎత్తుకుపోతున్నా పట్టుకోవటం లేదు అని మండిపడ్డారు. ఎర్రచందనం చైనాలో డోర్ డెలివరీ అవుతోంది. ఇది వై.సి.పి దేశ భక్తి అని అన్నారు, ప్రతి చెట్టును కూల్చటం వై.సి.పి పతనానికి మెట్టు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం పులి అనుకుంటే... పులిపోయి ఇప్పుడు బూతం పట్టుకుంది అని ఆయన ఎద్దేవా చేసారు. దేశం కోసం చాలా మంది ప్రాణాలు ఇచ్చారు. కనీసం ఓటు వేసేంత ఓపిక బాధ్యత కూడా లేదా?  అని నిలదీశారు.

దేశం కోసం నిలబడాలంటే ఓటు వేయాలి అని ఆయన కోరారు. ఆలయాలపై దాడుల దోషులను పట్టుకోని వారికి ఓటు వేస్తే దేవాలయాలను కూల్చిన వారికి ఒత్తాసుపలికినట్టే వై.సి.పి ఓటు వేస్తే వేంకటేశ్వరస్వామికి ద్రోహం చేసినట్టే అని అన్నారు. అయిదు సంవ్సరాలు అధికారంలో లేకపోతేనే తల్లడిల్లిపోతారే? జీవితకాలంలో అధికారంలోకి రాని జాతులు ఏం కావాలి? అని నిలదీశారు. బి.జె.పి, జనసేన సభలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు. దమ్ము ఉంటే జెడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లు స్వీకరించి ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన డిమాండ్ చేసారు. కోర్టు తీర్పు జనసేన వేసిన కేసుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. జనసైనికులు ప్రతి ఒక్కరు కష్టపడి ఓటు వేసి, ఓటు వేయించాలి అని ఆయన కోరారు.



టీడీపీ అభివృద్ధికి 200 కోట్లు ఇచ్చేవారు లేరా?

చంద్రబాబు, లోకేశ్ మధ్య ఫిట్టింగ్ పెడుతున్న వైసీపీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వంశీ ఇక ఫిక్స్ అయిపోయినట్లేనా?

బాబుకు ఆ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేస్తారా?

తమ్ముళ్ళ షాకింగ్ డెసిషన్...వైసీపీ తర్వాత స్థానం జనసేనదే..?

ఆ రెండు జిల్లాల్లో సైకిల్‌కు భారీ షాక్... ఫ్యాన్ కిందకే..

కిడ్నీ క్యాన్సర్ తో బాధ పడేవారు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>