PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంది. గత ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన తప్పుల కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నో ఇబ్బందులు పడింది. ప్రధానంగా కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పట్లో సహకరించారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. bjp,ap;kumaar;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;chief minister;letter;janasena party;nilam sawhney;partyపరిషత్ ఎన్నికలకు బిజెపి దూరంగా ఉంటుందా...?పరిషత్ ఎన్నికలకు బిజెపి దూరంగా ఉంటుందా...?bjp,ap;kumaar;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;chief minister;letter;janasena party;nilam sawhney;partySat, 03 Apr 2021 12:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంది. గత ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన తప్పుల కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నో ఇబ్బందులు పడింది. ప్రధానంగా కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పట్లో సహకరించారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ఇక ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు సహాయ సహకారాలు అందిస్తారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాస్త తేడాగా ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల కమిషనర్ విషయంలో కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఎన్నికల కమిషనర్ కొన్ని కొన్ని రాజకీయ పార్టీల మాటలు వినే ప్రయత్నం కూడా చేయకపోవడం వివాదాస్పదంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు.

దీనిపై ఇప్పుడు చాలావరకు విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరి కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.


అర్చ‌కుల వ‌యోః ప‌రిమితిపై టీటీడీ సంచ‌ల‌నం

నాగార్జున ముందున్న ఏకైక ఆప్షన్ అదే..

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై..!!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>