Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tablet-vesukoni-vedi-nellu-tagadam-valla-kalige-labalu-eve1f52cd87-17b4-4e45-b160-01634c573f69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tablet-vesukoni-vedi-nellu-tagadam-valla-kalige-labalu-eve1f52cd87-17b4-4e45-b160-01634c573f69-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఆస్పత్రికి వెళ్తారు.. అక్కడ ఇచ్చే కొన్ని మందులు వేసుకుంటారు. వాటిని రెగ్యులర్‌గా వాడుతుంటారు. వేసుకున్నాక నీరు తాగుతుంటారు. అయితే, దాదాపు ఏ వైద్య విధానంలో అయినా సరే.. ట్యాబ్లెట్స్‌ని వేసుకునే ముందు నీటిని తాగుతారు. అదే హోమియో మందులు అయితే అవసరం లేదు. కానీ, అలోపతి ఇలాంటివి ఏవి అయినా సరే ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు, వేసుకున్నాక కచ్చితంగా నీరు తాగాల్సిందే.. tablet;tara;mandula;aqua;coffee;shaktiటాబ్లెట్ వేసుకొని వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఫలితాలు ఇవే....?టాబ్లెట్ వేసుకొని వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఫలితాలు ఇవే....?tablet;tara;mandula;aqua;coffee;shaktiSat, 03 Apr 2021 07:00:00 GMTఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఆస్పత్రికి వెళ్తారు.. అక్కడ ఇచ్చే కొన్ని మందులు వేసుకుంటారు. వాటిని రెగ్యులర్‌గా వాడుతుంటారు. వేసుకున్నాక నీరు తాగుతుంటారు. అయితే, దాదాపు ఏ వైద్య విధానంలో అయినా సరే.. ట్యాబ్లెట్స్‌ని వేసుకునే ముందు నీటిని తాగుతారు. అదే హోమియో మందులు అయితే అవసరం లేదు. కానీ, అలోపతి ఇలాంటివి ఏవి అయినా సరే ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు, వేసుకున్నాక కచ్చితంగా నీరు తాగాల్సిందే..


సాధారణంగా మనం వేసుకునే ఎటువంటి ట్యాబ్లెట్స్ అయినా జీర్ణాశయంలోకి చేరి కరిగేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఐతే.. ఆ మందు ప్రభావం ప్రారంభమవడానికి మరింత సమయంలో పడుతుంది. మనకు ఉన్న అనారోగ్య సమస్యలు, మనం వేసుకునే మాత్రలపై ఇది ఆధారపడి ఉంటుంది. పూర్తిగా కరిగిపోయాక మెల్లమెల్లగా ఆ మందు రక్తంలో కలుస్తుంది. రోగి వయసు, బరువు వంటి పలు అంశాల ఆధారంగా కొంత మందిలో త్వరగా, మరి కొంత మందిలో ఆలస్యంగా రక్తంలో కలవడం జరుగుతుంది. కొన్ని రకాల మందులు రక్తంలో కలిసి ప్రభావం చూపించడానికి ఐదారు గంటల సమయం కూడా పడుతుంటుంది.



మనం ఎటువంటి ట్యాబ్లెట్లనైనా మంచి నీటితో వేసుకుంటాం. కొంత మంది మాత్రం గోరు వెచ్చని నీటితో మాత్రలు వేసుకునేందుకు ఇష్టపడతారు. దీని వల్ల మందులు బాగా పని చేస్తాయని నమ్ముతుంటారు. ఐతే.. నేరుగా మాత్రలను వేసుకునే కంటే గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే సత్ఫలితాలు ఉంటయని పలు పరిశోధనల్లో తేలింది. దాదాపు 50 మంది వలంటర్లలో సగం మందికి సాధారణ నీటితో మాత్రలు వేయించారు. మిగతా సగం మందికి గోరు వెచ్చని నీటిలో అవే మాత్రలను పొడి చేసి కలిపేసి ఇచ్చారు. కొద్ది గంటల తర్వాత వీరి రక్త నమూనాలను సేకరించి పరీక్షించి చూడగా.. గోరు వెచ్చని నీటిలో ట్యాబ్లెట్లు కలిపి వేసుకున్న వారి రక్తంలో త్వరగా కలిసినట్టు గుర్తించారు.


చల్లని నీటితో వేసుకునే మాత్రలు శరీరంలో కరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే.. సాధారణ ట్యాబ్లెట్స్ వేసుకోవాలనుకుంటే గోరు వెచ్చని నీటిలో ఓ ట్యాబ్లెట్ పడేసి కాసేపు ఆగి ఆ నీటిని తాగితే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిలో ట్యాబ్లెట్లు కలిపి వేసుకుంటే త్వరగా చిన్న పేగులోకి వెళ్తుందట. ఫలితంగా రక్తంలోకి క్షణాల్లో కలుస్తుందట. అందుకే.. మాత్రలు మింగడానికి మనం ఉపయోగించే ద్రవ పదార్థాల విషయంలో కచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


మాత్రలు వేసుకునేందుకు చిన్న పిల్లలు మారాం చేస్తే కొంత మంది పేరెంట్స్.. పాలు లేదా బాదం మిల్క్‌తో వాటిని వేయడానికి ప్రయత్నిస్తారు. సహజంగానే పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వేసుకుంటారు. ఐతే.. పాలు, టీ, కాఫీతో మాత్రలు వేసుకోవడం ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీలతో మాత్రలు వేసుకుంటే ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయట. యాంటీ బయోటిక్స్ వంటి కొన్ని రకాల మాత్రలు పాలులో వేసుకుంటే పూర్తి ప్రభావ రహితంగా మారిపోతాయి.చల్లగా ఉండే నీటితో ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది జీర్ణాశయంలోకి వెళ్లి వేడిగా మారడానికి కొంత సమయం పడుతుంది. అందుకే నేరుగా గోరు వెచ్చని నీటితోనే వేసుకుంటే శరీరానికి కొంత శక్తి కూడా ఖర్చు తగ్గుతుంది.
ఒక వేళ ట్యాబ్లెట్లను గోరు వెచ్చని నీటితో వేసుకున్నా.. వేసుకునే ముందు, వేసుకున్నాక కచ్చితంగా నీరు తాగాల్సిందేనని అంటున్నారు వైద్య నిపుణులు.


దగ్గు, జలుబు తో బాధపడుతున్న వారికి వేడి నీరు మంచిది. పొడి దగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలి చేసే శక్తి వేడి నీటికి ఉంది. గొంతు గరగర, గొంతు నొప్పిని కూడా నివారిస్తుంది.ప్రమాదకర బ్యాక్టరీయాలను తరిమే శక్తి వేడి కూడా వేడి నీటికి ఉంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలన్నా వేడి నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది.
రోజూ గోరు వెచ్చని నీరు తాగితే శరీరంలో మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయట. అలాగే.. అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయట.ఉదయాన్నే పరగడుపున ఓ గ్లాసుడు వేడి నీళ్లు తాగితే బరువు కూడా తగ్గుతారట. వేడి నీరు శరీరంలోకి వెళ్లాక ఉష్ణోగ్రత పెరిగి ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.


మ‌ళ్లీ ఖాళీ అవుతున్న న‌గ‌రం... హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా టు లెట్ బోర్డులే..

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>