LifeStyleGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/latest-news-white-rice-healthdc46ea60-852a-47b1-8373-8a3a537d2baf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/latest-news-white-rice-healthdc46ea60-852a-47b1-8373-8a3a537d2baf-415x250-IndiaHerald.jpgడాక్ట‌ర్ స్వామినాథ్ వ్య‌వ‌సాయంలో తీసుకువ‌చ్చిన విప్ల‌వం.. వ‌రి. ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు వ‌ర‌దాయినిగా మారిన ఈ వ‌రి అన్న‌మే అంద‌రూ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఇది చాలా ఖరీదైన వ్యవహారం. జొన్న, రాగి వంటి తృణధాన్యాలతో రొట్టె చేసుకొని తినేవారు. అప్పుడ‌ప్పుడూ బియ్యం వండుకునేవారు. దీంతో జొన్నలు, రాగులతో పాటు రొట్టె, అంబలి వంటి సంప్రదాయ వంటకాలు కాలగ‌ర్భంలో కలిసిపోయాయి. latest news, white rice, health;nithya new;raaga;local language;milletsరోజుకు వ‌రి అన్నం ఎంత తింటున్నారు?రోజుకు వ‌రి అన్నం ఎంత తింటున్నారు?latest news, white rice, health;nithya new;raaga;local language;milletsFri, 02 Apr 2021 06:40:49 GMTడాక్ట‌ర్ స్వామినాథ్ వ్య‌వ‌సాయంలో తీసుకువ‌చ్చిన విప్ల‌వం.. వ‌రి. ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు వ‌ర‌దాయినిగా మారిన ఈ వ‌రి అన్న‌మే అంద‌రూ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఇది చాలా ఖరీదైన వ్యవహారం. జొన్న, రాగి వంటి తృణధాన్యాలతో రొట్టె చేసుకొని తినేవారు. అప్పుడ‌ప్పుడూ బియ్యం వండుకునేవారు. దీంతో జొన్నలు, రాగులతో పాటు రొట్టె, అంబలి వంటి సంప్రదాయ వంటకాలు కాలగ‌ర్భంలో కలిసిపోయాయి.

తొంద‌ర‌గా జీర్ణ‌మ‌వ‌డంవ‌ల్ల‌
తృణధాన్యాలకు ఉండే సహజమైన లక్షణం ఆలస్యంగా జీర్ణమ‌వ‌వడం. వాటితో మ‌ధుమేహం, గుండెజబ్బులు వంటివి సమీపించేవి కావు. వాటితో పోలిస్తే వరి అన్నం త్వరగా జీర్ణమ‌వుతుంది. కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరిగి అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ప్ర‌జ‌లంతా తృణ‌ధాన్యాలు వాడాలంటూ వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. తృణధాన్యాలతో కూడిన ఇలాంటి స్థానిక ఆహారాలనే ఉత్తర భారతదేశమంతా వాడేవారు. 1990-2016 వరకు 80 శాతం మ‌ధుమేహ బాధితులు పెరిగిన‌ట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందుకే వరికి బదులు వైద్యులు రాగులు, జొన్నలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలతో కొత్త రకాల వంటలను నిత్యం ఆహారం కింద తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఆరోగ్యం కోసం తృణ‌ధాన్యాలు
రాయ‌ల‌సీమ వాసులు ఇప్ప‌టికీ నిత్యం వీటిని ఆహారంలో తీసుకుంటుంటారు. రాగులు, జొన్న‌లు, స‌జ్జల్లాంటివి ప్ర‌తిరోజు కొంచెం కొంచెం తీసుకున్నా చాల‌ని, వాటివ‌ల్ల శ‌రీరానికి వ‌రి అన్నంక‌న్నా ఎక్కువ శ‌క్తి వ‌స్తుంద‌ని చెపుతున్నారు. కొంచెం క‌ష్ట‌మైనా ముందుగానే నాన‌బెట్టుకొని వండుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. రాగిజావ‌, రాగిల‌డ్డు, జొన్న‌రొట్టె, అంబ‌ళి.. ఇలా అనేక‌ర‌కాల ప‌దార్థాలు తృణ‌ధాన్యాల‌తో త‌య‌రుచేసుకోవ‌చ్చ‌ని, ప్ర‌జ‌లంతా వీటిపై దృష్టిసారించాల‌ని కోరుతున్నారు. కర్నాటకలో రాగి లడ్డూ, రాగులతో చేసిన పూరీల‌ను తింటున్నారు. రెస్టారెంట్లలో, హెటళ్లలో వీటిని అమ్మ‌డంద్వారా తృణ‌ధాన్యాల‌కు పాపులారిటీ వ‌స్తోంది. ప్రతియేటా తృణధాన్యాల ప్రదర్శనలు, అమ్మకాల కోసం ప్రత్యేకమైన కౌంటర్లు తెరుస్తున్నారు. నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ఈ సంవ‌త్స‌రాన్ని నిర్ణయించారు. మ‌నం కూడా నెమ్మ‌ది నెమ్మ‌ది వ‌రి అన్నాన్ని త‌గ్గించుకుంటూ తృణ‌ధాన్యాల‌వైపు అడుగులేద్దాం!






ఏపీలో క‌రోనా రాకాసి విజృంభ‌ణ‌... వామ్మో ఇన్ని కొత్త కేసులా

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?

హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

తిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>