PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు ఉపాధి హామీ ప‌నులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్‌ పిటిషన్లు వేశారు. దీనిపై సుమారు ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్టింది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి ? ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమాధానంగా కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం jagan mohan reddy;2019;government;court;lawyer;fire;letter;central government;kavuru srinivasజ‌గ‌న్ ఈ త‌ప్పు ఎందుకు చేస్తున్న‌ట్టు... ప్ర‌భుత్వానికి దెబ్బే ?జ‌గ‌న్ ఈ త‌ప్పు ఎందుకు చేస్తున్న‌ట్టు... ప్ర‌భుత్వానికి దెబ్బే ?jagan mohan reddy;2019;government;court;lawyer;fire;letter;central government;kavuru srinivasThu, 01 Apr 2021 10:51:00 GMTఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టు శుభ్రంగా త‌లంటేసింది. అది కూడా షాంపూలూ.. గ‌ట్రాతో కాకుండా ఏకంగా కుంకుడు కాయ‌ల‌తో త‌లంటేసింది. పేద‌ల‌కు సంబంధించిన విష‌యాల్లో ఇంత ఉదాసీనంగా ఉంటారా ?  వారి డ‌బ్బులు కూడా దారిమ‌ళ్లిస్తారా ? అంటూ.. నిప్పులు చెరిగేసింది. రాష్ట్రంలో ఉపాధి హామీ ప‌థ‌కం కింద పేద‌లు చేసిన‌ పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే ఏకంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌ను నేరుగా కోర్టు మెట్లు ఎక్కిస్తామ‌ని తీవ్రంగా హెచ్చరించింది.

రాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు ఉపాధి హామీ ప‌నులు చేసిన వారికి  బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్‌ పిటిషన్లు వేశారు. దీనిపై సుమారు ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్టింది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి ? ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

దీనికి సమాధానంగా కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు.
చంద్ర‌బాబు పాల‌నా కాలంలో 2018 నుంచి 2019 వరకు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. పైగా రూ. 5 లక్షల లోపు ఉన్న బిల్లులకు 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు చెప్పి ఆ తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా ఈ త‌ప్పులు ఎందుకు చేస్తున్నాడా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రెండు వారాల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప‌రిణామం.. ప్ర‌భుత్వానికి శ‌రాఘాతంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.. గ‌తంలోనూ అప్ప‌టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని కూడా రెండు సార్లు హైకోర్టు మెట్లు ఎక్కిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ... ప్ర‌భుత్వంలో ఎలాంటి మార్పు రాక‌పోగా.. కోర్టుల‌పై ఎదురు దాడి చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది.



ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>