PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tadipatri1e3e4790-166b-4b66-a114-655251fafedb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tadipatri1e3e4790-166b-4b66-a114-655251fafedb-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా ఏపీ రాజకీయాలని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందటే అది తాడిపత్రి నియోజకవర్గమే. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం జేసీ ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి జేసీ దివాకర్ రెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచే జేసీ ఈ విజయాలు అందుకున్నారు.tadipatri;pawan;prabhakar;tiru;jagan;andhra pradesh;congress;jcdiwakarareddy;2019;chintamaneni prabhakar;fort;tdp;ycp;parakala prabhakar;reddyతాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?తాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?tadipatri;pawan;prabhakar;tiru;jagan;andhra pradesh;congress;jcdiwakarareddy;2019;chintamaneni prabhakar;fort;tdp;ycp;parakala prabhakar;reddyThu, 01 Apr 2021 03:00:00 GMT

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందటే అది తాడిపత్రి నియోజకవర్గమే. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం జేసీ ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి జేసీ దివాకర్ రెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచే జేసీ ఈ విజయాలు అందుకున్నారు.


ఇక రాష్ట్ర విభజన జరగడంతో దివాకర్ తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. ఇక దివాకర్ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే, ప్రభాకర్ తాడిపత్రి నుంచి పోటీ చేసి గెలిచారు. ఐదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉండటంతో జేసీ బ్రదర్స్‌కు తిరుగులేకుండా పోయింది. కానీ 2019 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలింది. జేసీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని పోటీలో ఉంచారు. అనంతపురం ఎంపీగా దివాకర్ తనయుడు పవన్ పోటీ చేసి ఓడిపోయారు.


ఇక తాడిపత్రిలో ప్రభాకర్ తనయుడు అస్మిత్ పోటీ చేసి ఓడిపోయారు. ఇలా జగన్ దెబ్బతో తొలిసారి జేసీ ఫ్యామిలీ తాడిపత్రిలో ఓటమి పాలైంది. అయితే ఇంతలా ఓడిపోయినా సరే జేసీ ఫ్యామిలీ వెనక్కి తగ్గలేదు. జేసీ ప్రభాకర్, అస్మిత్‌లు తాడిపత్రిలో మళ్ళీ కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు. దాని ఫలితంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడిపోయినా సరే తాడిపత్రిలో గెలిచింది. వార్డు మెంబర్‌గా పోటీ చేసి ప్రభాకర్ విజయం సాధించి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు.


అయితే రానున్న రోజుల్లో కొందరు టీడీపీ వార్డు మెంబర్లని తమవైపుకు తిప్పుకుని తాడిపత్రిని కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జేసీ ఫ్యామిలీ వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వనివ్వకుండా ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే నెక్స్ట్ అసెంబ్లీలో ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం తాడిపత్రి రాజకీయాలు చాలావరకు టర్న్ అయ్యాయి.





ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?

వకీల్ సాబ్ ఓవర్ సీస్ లో ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుందంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>