PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంశం ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావడం లేదు. అయితే మూడు రాజధానులు కి సంబంధించి తాజాగా కొన్ని ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి పరిపాలన రాజధాని విశాఖ కు తీసుకు వెళ్ళాలి అంటే కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా హైకోర్టు అనుమతి కావాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పరిపాలించడానికి కార్పొరేషన్ ఎన్నికల తర్వాతjagan,ycp,ap;jagan;andhra pradesh;botcha satyanarayana;vishakapatnam;capital;chief minister;minister;letter;partyజగన్ కు విశాఖ వెళ్ళడం సాధ్యమా...?జగన్ కు విశాఖ వెళ్ళడం సాధ్యమా...?jagan,ycp,ap;jagan;andhra pradesh;botcha satyanarayana;vishakapatnam;capital;chief minister;minister;letter;partyMon, 29 Mar 2021 21:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంశం ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావడం లేదు. అయితే మూడు రాజధానులు కి సంబంధించి తాజాగా కొన్ని ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి పరిపాలన రాజధాని విశాఖ కు తీసుకు వెళ్ళాలి అంటే కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా హైకోర్టు అనుమతి కావాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పరిపాలించడానికి కార్పొరేషన్ ఎన్నికల తర్వాత అన్ని విధాలుగా సిద్ధమయ్యారు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది.

 అయితే విశాఖలో పరిపాలించడానికి సంబంధించి కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సచివాలయం అక్కడికి తీసుకు వెళ్ళాలి అన్నా... లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అక్కడికి తీసుకు వెళ్లి పరిపాలించాలి అని భావించినా హైకోర్టు అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైల్స్ కూడా తీసుకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది అనే మాట వాస్తవం. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అడుగు వేస్తుంది ఏంటి అనేది స్పష్టత రావడం లేదు.

అయితే ఇప్పుడు పరిపాలన రాజధానికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పరిపాలిస్తారు అని ఆయన పేర్కొన్నారు. అంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని విశాఖ నుంచి పరిపాలించే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో కాస్త అధికార పార్టీ నేతలలో కూడా ఈ అయోమయ పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు అని కొంతమంది చెబుతున్నారు. ఒకవేళ పరిపాలించాలి అనుకుంటే జగన్ మాత్రమే గాని ప్రభుత్వం కాదని అంటున్నారు.


హైదరాబాద్ లో మాస్క్ లేకుంటే 2 వేల ఫైన్

అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>