PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-jagan16df4296-03eb-4499-8deb-6decb4d6a54f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-jagan16df4296-03eb-4499-8deb-6decb4d6a54f-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సాధారణంగా ఏదైనా మరణాలు సంభవించిన ప్రదేశాలలో ఉప ఎన్నికలు జరిగితే ఆ కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మొదట్లో అలా కుటుంబ సభ్యులకు సీటు ఇస్తే ఇతర పార్టీల వారు పోటీకి కూడా దింపేవాళ్లు కాదు. కానీ మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆ కుటుంబానికి సీటివ్వడం పక్కనపెట్టి ఎలా అయినా సీటు మళ్ళీ దక్కించుకోవడానికి పార్టీలు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అయితే ఈ సీటు tirupathi by elections;kcr;editor mohan;tiru;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;tirupati;media;assembly;husband;tdp;ycp;sv mohan reddy;reddy;partyతిరుపతి ఉప ఎన్నిక : కేసీఆర్ కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకుంటున్న టీడీపీ ?తిరుపతి ఉప ఎన్నిక : కేసీఆర్ కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకుంటున్న టీడీపీ ?tirupathi by elections;kcr;editor mohan;tiru;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;tirupati;media;assembly;husband;tdp;ycp;sv mohan reddy;reddy;partySun, 28 Mar 2021 12:00:00 GMTవైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సాధారణంగా ఏదైనా మరణాలు సంభవించిన ప్రదేశాలలో ఉప ఎన్నికలు జరిగితే ఆ కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మొదట్లో అలా కుటుంబ సభ్యులకు సీటు ఇస్తే ఇతర పార్టీల వారు పోటీకి కూడా దింపేవాళ్లు కాదు. కానీ మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆ కుటుంబానికి సీటివ్వడం పక్కనపెట్టి ఎలా అయినా సీటు మళ్ళీ దక్కించుకోవడానికి పార్టీలు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అయితే ఈ సీటు ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకు ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోవడానికి సిద్ధమవుతోంది. 

కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడిందని రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఏపీకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎకరా ఏపీలో రెండు ఎకరాల తో సమానం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు మూడు ఎకరాలు కొనేవారు అని, కానీ ఇప్పుడు అంత రివర్స్ అయిందని ఇక్కడ ఎకరం అమ్మి అక్కడ రెండు మూడు ఎకరాలు  కొంటున్నారని చెప్పుకొచ్చారు. అంటే గతంలో పోలుస్తూ ఏపీ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయింది అనే విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని ఇప్పుడు టీడీపీ అస్త్రంగా మార్చుకుంటుంది. 

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ వీడియోలు వైరల్ చేస్తుంది. ఇంత జరుగుతున్నా జగన్ నిద్రపోతున్నాడు అంటే అర్థం వచ్చేలా ఈ వీడియోలు ఉన్నాయి. ఇక ప్రచారంలో కూడా ముఖ్యంగా ఇదే అస్త్రాన్ని తెలుగుదేశం పార్టీ వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తిరోగమన దిశగా వెళుతోందని ఒకప్పుడు చంద్రబాబు సమయంలో ఉన్న రేట్లు అన్ని ఇప్పుడు తగ్గిపోయాయని, కేవలం నిత్యావసర వస్తువుల రేట్లు పెంచి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు అనే అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి తెలుగుదేశం ప్రయత్నం చేస్తోంది.




బిగ్ బాస్ బ్యూటీకి ఆఫర్ల వెల్లువ నిజమేనా...?

బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యే మృతి

ఆర్ ఆర్ ఆర్ అత్యాశకు షాక్ అయిన కార్పోరేట్ వర్గాలు ?

అరణ్య మొదటి రోజు వసూళ్లు....

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>