HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eat-these-to-stay-de-hydrated-in-summer6cd928ea-46e9-425c-8f75-7622ee9649a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eat-these-to-stay-de-hydrated-in-summer6cd928ea-46e9-425c-8f75-7622ee9649a6-415x250-IndiaHerald.jpgవేసవి కాలంలో ఎండలు రోజురోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఎండకు ఎక్కువగా ఉండటం వలన శరీరం నీటి నిల్వలను, పోషకాలను కోల్పోతుంది. ఇక వాటిని తిరిగి పొందేందుకు వివిధ రకాల పండ్లు తినడం చాలా అవసరం. అలాంటి పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. de hydrated;soundarya;vitamin a;vitamin;aqua;strawberry;cholesterol;dehydrationవేసవిలో డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇవి తినండి..!వేసవిలో డీ-హైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇవి తినండి..!de hydrated;soundarya;vitamin a;vitamin;aqua;strawberry;cholesterol;dehydrationSat, 27 Mar 2021 11:00:00 GMTనీటి నిల్వలను, పోషకాలను కోల్పోతుంది. ఇక వాటిని తిరిగి పొందేందుకు వివిధ రకాల పండ్లు తినడం చాలా అవసరం. అలాంటి పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండాకాలంలో మనం డీహైడ్రేట్‌ నుంచి బయటపడాలంటే కీరా దోస తినడం ఎంతో అవసరం. ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంది. కీరా కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఈ కీరా దోస తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు చర్మ సౌందర్యం కోసం కూడా ఈ పండును ఉపయోగిస్తారు. ఎండ వేడిని దాహార్తిని తీర్చడంలో పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక దీనిలో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ మంచి ఆహారం.

ఇక దాహార్తిని తీర్చడంలో స్ట్రాబెరీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో 91 శాతం నీరు ఉంటుంది. ఈ పండ్లలో ఉండే పీచు పదార్ధాల వల్ల ఏ, సీ, బీ6, బీ9, ఈ, కె విటమిన్లు మన శరీరానికి లభిస్తాయి. రక్తంలో కొవ్వును తగ్గించడమే కాకుండా క్యాన్సర్‌ను తగ్గించడంలో కూడా ఈ స్ట్రాబెర్రీ దోహదపడుతుంది. పైనాపిల్‌లో నీటి మోతాదు 87 శాతం. ఈ పండు తినడం వల్ల శరీరానికి అనేక విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఈ పండు వల్ల శరీరంలోని వ్యర్ధాలు బయటికి వస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంపై ఒత్తిడిని తగ్గించి ఉత్సాహాంగా ఉండేలా చేస్తుంది.

అంతేకాదు.. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా నీటిశాతాన్ని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లలో అతి ముఖ్యమైన ఫలం కర్బూజ. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా తినమని నిపుణులు సూచిస్తుంటారు. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే మలబద్దకం సమస్య దూరమవుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. మూత్ర సంబంధిత వ్యాధులు, సమస్యలు తగ్గుతాయి. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలసట, బీపీ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


మరో పోరుకు జగన్ రెడీ...?

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>