PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-election5de106e2-8efb-4560-b497-e695a01fbbb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-by-election5de106e2-8efb-4560-b497-e695a01fbbb3-415x250-IndiaHerald.jpgబీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారుNAGARJUNA SAGAR BY ELECTION;nagarjuna akkineni;hari;hari music;ravi anchor;sridhar;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;congress;district;backward classes;nalgonda;assembly;husband;janareddy;local language;reddy;nayak;partyసాగర్ బీజేపీలో వర్గ పోరు?సాగర్ బీజేపీలో వర్గ పోరు?NAGARJUNA SAGAR BY ELECTION;nagarjuna akkineni;hari;hari music;ravi anchor;sridhar;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;congress;district;backward classes;nalgonda;assembly;husband;janareddy;local language;reddy;nayak;partySat, 27 Mar 2021 19:39:04 GMTబీజేపీ సాగర్ లోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని సాగర్ ఉప ఎన్నికలోనూ రిపీట్ చేయాలని కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ నేతల ఆశలకు స్థానిక కమలం నేతలు బ్రేకులు వేస్తున్నారట.నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీలో తిరుగుబాటుకు కారణమవుతుందని తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి.. ఎవరికి వారు టికెట్ పోటీ పోరాడుతున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన నివేదితా రెడ్డితో పాటు కడారి అంజయ్య యాదవ్, ఇంద్రసేనా రెడ్డి, రవి నాయక్ టికెట్ ఇస్తున్నారు. వీళ్లంతా ఎవరికి వారే సొంత టీమ్ తో తిరుగుతుండటంతో కేడర్ లో గందరగోళం నెలకొన్నదని చెబుతున్నారు.

బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం ఆయన పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో వీళ్లు ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ తనకే టికెట్‌ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో నామినేషన్‌ దాఖలు చేసినట్లు నివేదితా రెడ్డి చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోక ముందే నివేదిత నామినేషన్‌ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పార్టీ ఆమెకు టికెట్‌ కేటాయించని పక్షంలో రెబల్‌గా బరిలో ఉంటుందా.? లేక ఉపసంహరించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిత నామినేషన్‌ దాఖలు చేసి ఓ రకంగా ఆ పార్టీని ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.

నాగార్జున సాగర్ లో అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన పడుతోంది. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. అధికార పార్టీ నుంచి బీసీ వ్యక్తి అభ్యర్థిగా ఉంటారని తెలుస్తోంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఖరారు అయ్యాకా... సామాజిక కోణంలో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. సాగర్ లో యాదవులతో పాటు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు వార్గాల నుంచే బీజేపీ అభ్యర్థి ఉండవచ్చని చెబుతున్నారు. కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆలోచన ఇలా ఉంటే.. కంకణాల నివేదితా రెడ్డి నామినేషన్ వేయడం ఇప్పుడు బీజేపీలో కాక రేపుతోంది. టికెట్ రేసులో ఉన్నవారిలో ఎవరికి టికెట్ రాకున్నా.. వాళ్లు తిరుగుబాటు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.




హైదరాబాద్ నుంచి మరో కోవిడ్ టీకా

పవన్‌, బాబూ.. ఉయ్యాలవాడ పేరును కూడా తప్పుబడతారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పేటలో రజినికి చెక్ పెట్టడం కష్టమేనా?

తిరుపతికి రామ్మోహన్ నాయుడు కావాల్సిందేనా...

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>