PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kannababu-says-toxic-value-in-air28033d4b-c981-4712-b544-2dda83017d80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kannababu-says-toxic-value-in-air28033d4b-c981-4712-b544-2dda83017d80-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉంది. వారికి జగన్ అన్ని విధాలుగా సహాయం చేస్తున్నా బ్యాంకు లు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. ఇక తాజాగా ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి 2.31 లక్ష కోట్లు క్రెడిట్ ప్లాన్ గా నాబార్డు నిర్ధారించింది అని ఆయన అన్నారు. 1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారు అని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకంగా 1.13 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యం అని వివరించారు. కౌలు రైతులకు రkannababu,ycp,ap;jagan;andhra pradesh;rbi;minister;vegetable marketబ్యాంకులకు వార్నింగ్ ఇచ్చాం: ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలుబ్యాంకులకు వార్నింగ్ ఇచ్చాం: ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలుkannababu,ycp,ap;jagan;andhra pradesh;rbi;minister;vegetable marketFri, 26 Mar 2021 18:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉంది. వారికి జగన్ అన్ని విధాలుగా సహాయం చేస్తున్నా బ్యాంకు లు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. ఇక తాజాగా ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి 2.31 లక్ష కోట్లు క్రెడిట్ ప్లాన్ గా నాబార్డు నిర్ధారించింది అని ఆయన అన్నారు. 1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారు అని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకంగా 1.13 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యం అని వివరించారు.

కౌలు రైతులకు రుణాలు ఇవ్వటంలో ఇంకా బ్యాంకర్లు వెనకాడుతున్నారు అని ఆరోపించారు. ఇది చాలా ఇబ్బందికరం అని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశాం  అని ఆయన చెప్పుకొచ్చారు. 4 లక్షల పైచిలుకు మంది కౌలు  రైతులకు సీసీఆర్ కార్డులు జారీ చేశాం అని ఆయన పేర్కొన్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్  పార్కులు  ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2900 కోట్లతో ఈ పార్కుల్ని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం  అని ఆయన చెప్పుకొచ్చారు.

రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్ధతుధరతో పాటు వాటికి విలువ దక్కాలన్నదే  ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు. 13 వేల  కోట్లతో ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నాం అని ఆయన అన్నారు. తొలిదశ గోదాములను కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మొదలు అవుతాయి అని తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాలు, డీసీసీబీల్లో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించాంఅని ఆయన పేర్కొన్నారు. 500 కోట్లతో మార్కెట్ యార్డుల్లో ఆధునీకరణ చేపడుతున్నాం అని ఆయన అన్నారు. గ్రామీణ స్థాయిలోనూ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకునేలా ఇ-ప్లాట్ ఫాం ద్వారా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవలేదని హర్ట్ అయిన సుమ.. ఆ మూవీ టీమ్ పై కోపంతో ఏం చేసిందంటే..!!

హెరాల్డ్ సెటైర్: మళ్ళీ ఆ పాటే పాడుతున్న టీడీపీ

టాలీవుడ్ గాసిప్స్: అప్పట్లో 100 రోజులు ఆడి, 15 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా..?

మోదీపై ఉక్కు ఆగ్ర‌హం ఈ రేంజ్‌లోనా...

ఎట్టకేలకు...ఆ జంట వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది...!

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలన్నది ఈ హీరోయినా నా..!!

వైసీపీ ఫ‌టాఫ‌ట్.. టీడీపీ ధ‌నాధ‌న్‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>