MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/herald-mla-progress-myalavaram-mla-vasantha-venkata-krishnaprasadf602d0d1-734b-4e48-a4fa-9b38df0c0813-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/herald-mla-progress-myalavaram-mla-vasantha-venkata-krishnaprasadf602d0d1-734b-4e48-a4fa-9b38df0c0813-415x250-IndiaHerald.jpgసాధారణంగా టీడీపీలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో రెడ్డి వర్గం హవా ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీలో ఉన్న కమ్మ నేతలకు చెక్ పెట్టేందుకు జగన్, అదే సామాజికవర్గానికి చెందిన నేతలని పోటీలో పెట్టి విజయం సాధించారు. అలా కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమాపై వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. అయితే ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే. ysrcp;krishna;prasad;krishna river;kamma;jagan;congress;devineni avinash;2019;district;mla;minister;cheque;krishna district;ycp;mylavaram;devineni uma maheswara rao;reddy;dookuduహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ కమ్మ ఎమ్మెల్యే దూకుడు తగ్గిందా?ysrcp;krishna;prasad;krishna river;kamma;jagan;congress;devineni avinash;2019;district;mla;minister;cheque;krishna district;ycp;mylavaram;devineni uma maheswara rao;reddy;dookuduThu, 25 Mar 2021 05:00:00 GMTకమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే వైసీపీలో రెడ్డి వర్గం హవా ఉంటుంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీలో ఉన్న కమ్మ నేతలకు చెక్ పెట్టేందుకు జగన్, అదే సామాజికవర్గానికి చెందిన నేతలని పోటీలో పెట్టి విజయం సాధించారు. అలా కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమాపై వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. అయితే ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణప్రసాద్...1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నందిగామ నుంచి పోటీ చేసి దేవినేని ఉమాపై ఓడిపోయారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతగానే కొనసాగుతూ రాజకీయాలు చేశారు. ఇక రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా అయిపోవడంతో, 2014లో టీడీపీలో చేరారు.

కానీ 2019 ఎన్నికలకొచ్చేసరికి వసంతకి టికెట్ దొరుకుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. దీంతో వసంత టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చి, మైలవరం బరిలో నిలిచి..తన చిరకాల ప్రత్యర్ధి దేవినేని ఉమాని మట్టికరిపించి ఎమ్మెల్యే అయ్యారు.

ఎమ్మెల్యే అవ్వడమే వసంత దూకుడు ప్రదర్శించారు. టీడీపీని, దేవినేని ఉమాపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వచ్చారు. నియోజకవర్గంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే వసంత అనుచరులు నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు.

అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా వసంత దూకుడు తగ్గలేదు. ఉమాకు ధీటుగా వసంత ముందుకెళుతున్నారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో సైతం మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. ఇక ఉమా కూడా గట్టిగానే పోరాడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. మరి చూడాలి ఉమా, వసంత దూకుడుని తగ్గించగలరో లేదో.




హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని లేవకుండా దెబ్బకొట్టిన వైసీపీ, టీడీపీ గేమ్ ప్లాన్

ఏప్రిల్ 1 నుంచి భార‌త్‌లో లాక్‌డౌన్‌

బ్రేకింగ్: వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

అందుకే సుశాంత్ తో తెగదెంపులు అయ్యాయి.. మాజీ లవర్ అంకిత..!!

టాలీవుడ్ గాసిప్స్ : పవన్ కళ్యాణ్ గారి తో పని చేయడం...నా అదృష్టం అంటున్న వేణు శ్రీరామ్..!

పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న షర్మిల...?

రామ్ చరణ్ ను వెనక్కు నెట్టిన బాలీవుడ్ హీరో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>